అంత ఈజీ కాదు ప్రభాస్ గారు..!

  • April 3, 2019 / 06:31 PM IST

‘సాహో’ చిత్రంతో ప్రభాస్ ప్రస్తుతం బిజీగా గడుపుతున్నాడు. సుజీత్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల కాబోతుందని టాక్ నడుస్తుంది. ఇక ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దిరేషన్లో కూడా ప్రభాస్ ఓ చిత్రం చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘జాన్’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని ‘యూవీ క్రియేషన్స్’ అలాగే ‘గోపీకృష్ణ మూవీస్’ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళంలో కూడా ఇక కాలంలో విడుదల చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు.

ఇందులో భాగంగా 2020 సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట. అయితే అదే టైంకి తమిళంలో రజనీకాంత్ చిత్రం కూడా విడుదల కాబోతుందట. రజనీకాంత్ హీరోగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ డైరెక్షన్లో ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్ళనుంది. ‘సన్ పిక్చర్స్’ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని కూడా సంక్రాంతికి కనుకగానే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాతలు ముందే ప్లాన్ చేసుకున్నారట. దీంతో ఈ రెండు చిత్రాలకి అక్కడ పెద్ద ఫైట్ తప్పదని ఫిలింనగర్ విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు. ఎంత క్రేజ్ ఉన్నా.. రజనీ కాంత్ చిత్రంతో పోటీ అంటే ఆషామాషీ విషయం కాదు .. అందులోనూ తమిళ నాడులో..! మరి చివరికి ప్రభాస్ టీం ఏం చేస్తుందో చూడాలి…!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus