Prabhas: ప్రభాస్ అభిమానులను టెన్షన్ పెట్టే వార్త చెప్పిన అశ్వినీ దత్..!

  • July 29, 2022 / 11:11 AM IST

ప్రభాస్ హీరోగా ఇప్పుడు 3 భారీ చిత్రాలు రూపొందుతున్నాయి. ఒకటి ‘ఆదిపురుష్’,మరొకటి ‘సలార్’, మూడోది ‘ప్రాజెక్ట్ కె’. ఆ మూడో చిత్రాన్ని అశ్వినీ దత్ నిర్మిస్తున్నారు. ఏకంగా రూ.500 కోట్ల భారీ బడ్జెట్ తో ఆయన ‘ప్రాజెక్ట్ కె’ ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఆయన ‘సీతా రామం’ ప్రమోషన్లలో భాగంగా మీడియాతో ముచ్చటించాడు. ఆగస్టు 5న విడుదల కాబోతున్న ఈ చిత్రానికి సంబంధించి నిర్వహించే ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ప్రభాస్ హాజరయ్యే అవకాశాలు ఉన్నాయా అంటూ దత్ గారికి ఓ ప్రశ్న ఎదురైంది.

దీనికి ఆయన సమాధానమిస్తూ ఓ బాంబ్ పేల్చాడు. ‘ప్రభాస్‌ ఇండియాలో ఉంటే కచ్చితంగా వచ్చేవాడు. కానీ అతను సర్జరీ కోసం విదేశాలకు వెళ్లాడు’ అంటూ అశ్వినీ దత్ తెలిపారు. ప్రభాస్ కాలు సర్జరీ కోసం విదేశంలో ఉన్నాడట. ప్రభాస్‌కు సర్జెరీలు ఏమీ కొత్త కాదు. ‘బాహుబలి'(సిరీస్) షూటింగ్ టైంలో అరడజను సార్లు అతను సర్జెరీలు చేయించుకున్నాడు. ‘బయట అతను బద్దకంగా ఉంటాడు కానీ సినిమా అనేసరికి ఒళ్ళు హూనం చేసుకుని మరీ కష్టపడతాడు’ అంటూ రాజమౌళి ఓ సందర్భంలో చెప్పిన సంగతి తెలిసిందే.

ఇక ఇదే క్రమంలో ‘ప్రాజెక్ట్‌ కె’ ను 2023 అక్టోబర్‌ 18న లేదా 2024 జనవరిలో విడుదల చేయాలని ప్లాన్‌ చేస్తున్నట్టు అశ్వినీదత్‌ తెలియజేశాడు. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం అవెంజర్స్ రేంజ్లో ఉంటుందని, ఇంటర్నేషనల్ మార్కెట్లను కూడా టార్గెట్ చేస్తున్నట్టు అశ్వినీ దత్ చెప్పుకొచ్చారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోనె ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుండగా, అమితాబ్ బచ్చన్ ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు.

థాంక్యూ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus