Prasanth Neel, Ram Charan: చరణ్‌తో ఫిక్స్‌ అనుకోవచ్చా దానయ్య గారూ!

  • October 16, 2021 / 07:34 AM IST

టాలీవుడ్‌లో గాసిప్స్‌ ఎలా పుడతాయి అంటే… రెండు రకాల సమాధానాలు వస్తాయి. ఒకటి ఎవరైనా లీక్‌ ఇస్తే, రెండోది అనుకోకుండానో, అనుకునో బయటకు వచ్చే కొన్ని ఫొటోల నుండి. తాజాగా అలాంటి ఓ ఫొటో బయటికొచ్చింది, దాంతోపాటే రూమర్‌ కూడా వచ్చేసింది. అయితే ఈ రూమర్‌ చాలావరకు కరెక్ట్‌ అవ్వొచ్చు అనిపిస్తోంది. కారణం ఆ ఇమేజ్‌ను ట్వీట్‌ చేస్తున్నప్పుడు రాసిన టెక్స్ట్‌. ‘కేజీఎఫ్‌’ తో మొత్తం భారతీయ సినిమాను అల్లాడించిన దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌.

ఆ సినిమాకు సీక్వెల్‌ కూడా తీసేశాడు. త్వరలో రాబోతోంది. ఆ సినిమా ఎంత హిట్‌ అవుతుంది అనేది పక్కపెట్టి… వరుసగా అడ్వాన్స్‌లు ఇచ్చి మరీ దర్శకుడి మీద కర్చీఫ్‌లు వేసేస్తున్న మన నిర్మాతలు. హీరోలు కూడా అదే పనిలో ఉన్నారనుంకోండి. తాజాగా మెగా కుటుంబంలో ఓ హీరోతో సినిమా చేయడానికి ప్రశాంత్‌ నీల్‌ ఓకే అన్నాడని సమాచారం. ప్రశాంత్‌ నీల్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్నారు. ఇటీవల ప్రశాంత్‌కు రామ్‌చరణ్‌ దంపతులు డిన్నర్‌కు పిలిచారట.

ఈ సమయంలో ప్రశాంత్‌ నీల్‌తోపాటు నిర్మాత డీవీవీ దానయ్య కూడా అక్కడే ఉన్నారు. దానికి సంబంధించిన ఫొటోలను ప్రశాంత్‌ నీల్‌ ట్వీట్‌ చేశాడు. దీంతో రామ్‌చరణ్‌తో ప్రశాంత్‌ నీల్‌ సినిమా అని అనేసుకుంటున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపైనే ఈ సినిమా ఉండబోతోందని టాక్‌. మరి ఇందులో ఎంతవరకు నిజముందో చూడాలి.

కొండ పొలం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus