కల్యాణ్ రామ్ మాయలో పడ్డాడు!!

  • August 18, 2016 / 07:35 AM IST

టాలీవుడ్ టాప్ ఫ్యామిలీలో ఒకటైన నందమూరి వంశం నుంచి వచ్చిన కల్యాణ్ రామ్…హీరోగానే కాదు, మంచి నిర్మాతగా సైతం పేరు సంపాదించుకున్నాడు. అయితే ఆయన ఇండస్ట్రీ కి వచ్చి దాదాపుగా 10 సంవత్సరాలలో అయినప్పటికీ…. ఎన్నో సినిమాలలో నటించినప్పటికీ, కేవలం ‘అతనొక్కడే’ ‘పటాస్’ సినిమాలు తప్ప కళ్యాణ్ రామ్ కు చెప్పుకోతగ్గ  హిట్స్ ఏవీ లేవు.

అయితే అదే క్రమంలో నిర్మాతగా…ఆర్ధికంగా కూడ బాగా నష్టపోయాడు కళ్యాణ్ రామ్. ఇదిలా ఉంటే ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నిర్మింప బడుతున్న ‘ఇజం’ సినిమా పై చాల ఆసలు పెట్టుకున్నాడు. కళ్యాణ్ రామ్ ను ఒక జర్నలిస్ట్ గా మార్చి అతడి లుక్ ను కూడ పూర్తిగా మార్చి వేసి ఈసినిమాను తీస్తున్న పూరిజగన్నాథ్ కు ఈసినిమాను చేసినందుకు 8 కోట్ల పారితోషికం పుచ్చుకుంటున్నాడు అన్న వార్తలు ఫిలింనగర్ లో హాట్ న్యూస్ గా మారింది.  అదే క్రమంలో అటు పూరీ…ఇటు కల్యాణ్ రామ్ ఇద్దరు ఫ్ల్యాప్స్ లో ఉన్నారు…అయినా పూరీకి ఈ రేంజ్ లో పారితోషికం చూస్తుంటే….ఏదో జరిగింది అన్న అనుమానం అందరికీ కలుగుతుంది.

టాలీవుడ్ సర్కిల్స్ నుంచి వస్తున్న సమాచారం ప్రకారం…పూరి మాయలో కళ్యాణ్ రామ్ పడిపోయాడు అని అందుకే పూరీ ఫ్లాప్ బాటలో ఉన్నా…అతనికి 8కోట్లు ఇచ్చాడు అని తెలుస్తుంది..అయితే కల్యాణ్ కి సైతం  హిట్ చాలా అవసరం కావడంతో పూరీ అడిగిన రెమ్యునిరేషన్ కు నో చెప్పలేదు అని అర్ధం అవుతుంది. ఏది ఏమైనా…ఈసినిమా అయిన కల్యాణ్ రామ్ కు హిట్ అవ్వాలని ఆశిద్దాం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus