చిరంజీవిపై పరోక్షంగా విమర్శలు గుప్పించిన పూరి జగన్నాథ్

  • October 22, 2016 / 08:05 AM IST

మెగాస్టార్ చిరంజీవి టార్గెట్ గా పూరి పంచ్ లు పేలుస్తున్నారు. ఆయన డైరక్ట్ చేసిన తాజా చిత్రం ఇజం ప్రమోషన్లో భాగంగా చిరు పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. పూరీని గతంలో చిరంజీవి అవమానించారు. తన 150 వ చిత్రం పూరి జగన్నాథ్ తో ఉంటుందని ప్రకటించి.. ఆ తర్వాత ఆటోజానీ కథ నచ్చలేదని  డైరక్టర్ ని మార్చారు. ఈ విషయాన్నీ డేరింగ్ డైరక్టర్ ఇంకా మర్చిపోలేదు. తాజా ఇంటర్వ్యూ లలో సంచలనమైన కామెంట్లు చేశారు.

‘‘లైఫ్‌లో రిస్క్ తీసుకునే సామర్థ్యం ఉంటే ఏమైనా చేయొచ్చు. కానీ తెలుగులో హీరోలు చాలా మంది రిస్క్ చేయడానికి భయపడుతున్నారు” అని పూరి చెప్పారు. అంతే కాదు కొంతమంది కొత్త కథలు చేసే దైర్యం లేక రీమేక్ లనే నమ్ముకున్నారంటూ వెల్లడించారు. ఈ మాటలను బట్టి చూస్తే మెగాస్టార్ పై మాత్రమే కాదు మెగా ఫ్యామిలీ పైనే పంచ్ వేసినట్లు తెలుస్తోంది. ఎందుకంటే చిరు కత్తి ని రీమేక్ చేస్తుంటే,  పవన్ కళ్యాణ్ వీరమ్ ని కాటమ రాయుడుగా తీస్తున్నారు. రామ్ చరణ్ కూడా తనివరువన్ తమిళ చిత్రాన్ని ధృవ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసే పనిలో ఉన్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus