Radhika Apte: టాలీవుడ్‌లో ఫేవరిటిజం ఎక్కువ.. హీరోయిన్ కామెంట్స్!

  • May 25, 2021 / 02:26 PM IST

బాలీవుడ్ ముద్దుగుమ్మ రాధికా ఆప్టే వివాదాస్పద కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంటుంది. తాజాగా ఆమె దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి, ‘రక్తచరిత్ర’ సినిమా గురించి చెప్పిన విషయాలు సంచలనంగా మారాయి. ఆ సినిమాలో నటించాలని చెప్పి తనను మోసం చేశారని చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల జరిగిన ఓ మీడియా సమావేశంలో ఈ బ్యూటీ కొన్ని కామెంట్స్ చేసింది. రామ్ గోపాల్ వర్మ రూపొందించిన ‘రక్తచరిత్ర’ సినిమాలో గ్రామీణ యువతీ పాత్రలో ప్రేక్షకులను మెప్పించడానికి చాలా కష్టపడ్డానని..

అయితే సినిమా షూటింగ్ సమయంలో చాలా ఇబ్బందిగా ఫీలైనట్లు చెప్పింది. తనకు ముందు ఒకటి చెప్పి.. సెట్స్ పైకి వచ్చిన తరువాత మరొకటి చేశారంటూ అప్పటి సంగతులు గుర్తుచేసుకుంది. తనకు తక్కువ రెమ్యునరేషన్ చెల్లించారని.. కానీ వర్క్ బాగా చేయించుకున్నారని రాధికా ఆప్టే చెప్పింది. తనకు ఒక భాషలో చిత్రీకరిస్తున్నామని చెప్పి.. షూటింగ్ సమయంలో తెలుగుతో పాటు తమిళంలో కూడా తీశారని.. తనతో డబుల్ వర్క్ చేయించుకున్నారని చెప్పింది.

ఒకానొక సందర్భంలో సినిమా నుండి తప్పుకుందామని అనుకున్నట్లు చెప్పింది. ఇదిలా ఉంటే.. షూటింగ్ టైమ్ కి స్టార్ట్ అయ్యేది కాదని.. స్టార్ హీరోలు నటిస్తున్నాడు కాబట్టి వాళ్ల కోసం గంటల తరబడి వెయిట్ చేయాల్సి వచ్చేదని చెప్పుకొచ్చింది. అప్పుడు తన టాలెంట్ కి, సమయానికి విలువ లేదనిపించిందని చెప్పింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫేవరిటిజం, టైమ్ ను దుర్వినియోగం చేయడం బాగానే కనిపించాయంటూ ఘాటు కామెంట్స్ చేసింది!

Most Recommended Video

10 మంది టాలీవుడ్ సెలబ్రిటీలు మరియు వారి అలవాట్లు..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!
ఈ 15 మంది సెలబ్రిటీలు బ్రతికుంటే మరింతగా రాణించే వారేమో..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus