విజయ్ దేవరకొండపై అభినందనలు కురిపించిన రాజమౌళి

  • August 16, 2018 / 06:28 AM IST

శ్రీరస్తు శుభమస్తు సినిమా తర్వాత పరశురామ్ తెరకెక్కించిన మూవీ “గీత గోవిందం”. విజయ్ దేవరకొండ, రష్మిక మందన హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా నిన్న రిలీజ్ అయి మంచి స్పందన అందుకుంది. ముఖ్యంగా విజయ్ దేవర కొండ హాస్యాన్ని కూడా భలే పండించారని అందరూ ప్రశంసిస్తున్నారు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు నిర్మించిన ఈ మూవీని తొలి రోజే దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి చూసారు. అంతేకాదు తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికపై పంచుకున్నారు. “గీత గోవిందం సినిమా చూసి చాలాసేపు నవ్వుకున్నాను, విజయ్ దేవరకొండ నుంచి ఇది అస్సలు ఊహించలేదు.

‘అర్జున్ రెడ్డి’ తర్వాత ఈ చిత్రం విజయ్ దేవరకొండ బెస్ట్ ఛాయిస్, తాను ఏం చేస్తున్నాడో అతనికి స్పష్టంగా తెలుసు” అని అభినందించారు. అలాగేఈ చిత్రం సరదా సన్నివేశాలతో ఉందని, దర్శకుడు పరశురామ్ చాలా బాగా తెరకెక్కించాడని రాజమౌళి ప్రశంసించారు. ప్రస్తుతం రాజమౌళి #RRR మూవీ పనుల్లో బిజీగా ఉన్నారు. తొలిసారి ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ్ కలిసి నటిస్తున్న ఈ సినిమా.. ఇరు హీరోల అభిమానులకు నచ్చాలని కష్టపడుతున్నారు. నగరశివార్లలో భారీ సెట్స్ వేస్తున్నారు. నవంబర్ నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus