ఎన్టీఆర్, రాజమౌళి కాంబినేషన్లో నాలుగో మూవీ!

  • July 15, 2017 / 02:14 PM IST

బాహుబలి తర్వాత రాజమౌళి చేసే ప్రాజక్ట్ పై భారీ క్రేజ్ నెలకొని ఉంది. నెక్స్ట్ సినిమాలో గ్రాఫిక్స్, విజువల్ ఎఫక్ట్స్ ఆశించవద్దని చెప్పినప్పటికీ.. ఆ కథ ఏమిటి ? హీరో ఎవరు ? అనే విషయాలు తెలుసుకోవాలనే ఆరాటం పెరిగింది. జక్కన్న నెక్స్ట్ హీరో మహేష్ బాబు,  సుబ్బరాజు అని కొంతమంది పేర్లు వినిపించాయి. తాజాగా ఎన్టీఆర్ పేరు బయటికి వచ్చింది. వీరిద్దరి కలయికలో ‘స్డూడెంట్‌ నెం.1’, ‘సింహాద్రి’, ‘యమదొంగ’ వచ్చాయి. మూడూ సూపర్ హిట్ సాధించాయి. మళ్ళీ వీరి కాంబినేషన్లో సినిమా ఎప్పుడు వస్తుందా? అని అభిమానులు ఏడేళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు అందుకు ముహూర్తం కుదిరిందని ఫిలిం నగర్ వాసులు చెబుతున్నారు.

తారక్ ని దృష్టిలో పెట్టుకొని విజయేంద్ర ప్రసాద్ కథ రాస్తున్నారని వెల్లడించారు. ఆ కథ చర్చల్లోనే జక్కన్న మునిగి ఉన్నారని టాక్. ప్రస్తుతం ఎన్టీఆర్‌ బాబీ దర్శకత్వంలో ‘జై లవకుశ’ చేస్తున్నారు. ఆ తరవాత త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.  ఈ రెండు పూర్తి అయినా తర్వాత రాజమౌళి సినిమా ఉంటుందా? లేకుంటే జై లవకుశ కంప్లీట్ కాగానే జక్కన్న ప్రాజక్ట్ మొదలు పెడుతారా ? అనేది ఇంకా క్లారిటీ రాలేదు. నాలుగోసారి ఎన్టీఆర్ ను రాజమౌళి ఏవిధంగా చూపించనున్నారోనని ఆసక్తి మొదలయింది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus