ప్రముఖ రచయితని #RRR టీమ్ లోకి తీసుకున్న రాజమౌళి

  • September 20, 2018 / 11:26 AM IST

బాహుబలి సినిమాల తర్వాత దర్శకధీరుడు రాజమౌళి చేస్తున్న #RRRపై అంచనాలు మామూలుగా లేదు. ఆయన తొలి సారి మల్టీ స్టారర్ మూవీ చేయడం.. అది కూడా నందమూరి, మెగా హీరోలు కలిసి నటిస్తుండడంతో సూపర్ క్రేజ్ వచ్చింది. ఈ సినిమా తెరకెక్కించడంలోనే కాదు.. పబ్లిసిటీ విషయంలోను రాజమౌళి పక్కాగా ఉన్నారు. ఫస్ట్ లుక్ నుంచి ప్రతి విషయంలోనూ హాలీవుడ్ టెక్నీషియన్ల ప్రమేయం ఉండనుంది. అలాగే బాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెల్లాలో ఆలోచిస్తున్నారు. ఇలా #RRR చిత్రానికి వెనుక చాలా పని జరుగుతోంది. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం కోసం నగర శివార్లలో భారీ సెట్స్ వేస్తున్నారు. అలాగే రామోజీ ఫిలిం సిటీలో భారీ సెట్స్ వేస్తున్నారు.

అంతేనా తాజాగా ఈ చిత్ర బృందంలోకి ప్రముఖ రచయిత సాయి మాధవ్ బుర్రా వచ్చి చేరారు. గౌతమి పుత్ర శాతకర్ణి, ఖైదీ నంబర్ 150 , మహానటి వంటి సినిమాలకు మాటలను అందించిన ఈయన ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్, సైరా నరసింహా రెడ్డి చిత్రాలకు పనిచేస్తున్నారు. రాజమౌళి కోరగానే #RRR టీమ్ లో జాయిన్ అయ్యారు. వాస్తవానికి బాహుబలి సినిమాకే మాటలు రాయమని రాజమౌళి సాయి మాధవ్ ని కోరారంట. అయితే అప్పుడు వేరే సినిమాలకి కమిట్ అయి ఉండడం వల్ల కుదరలేదని తెలిసింది. ఇప్పుడు రాజమౌళి తో కలిసి పనిచేసే అవకాశం రావడంతో ఆనందంగా ఉన్నారు. ఈ మూవీ ఈ ఏడాది చివర్లో సెట్స్ మీదకు వెళ్లనుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus