స్టైలిష్ విలన్ గా మారనున్న యాంగ్రీ యాంగ్ మేన్

  • May 3, 2018 / 01:48 PM IST

హీరోగా సరైన అవకాశాలు లేక ఆ టైమ్ లో వచ్చిన విలన్ అవకాశాలను క్యాష్ చేసుకొంటే.. “హీరోగా వర్కవుట్ అవ్వడం లేదు కాబట్టి విలన్ పొజిషన్ కి దిగజారాడు” అని జనాలు ఎక్కడ అనుకొంటారనే భయంతో కొన్నాళ్లపాటు సినిమాలకి దూరంగా గడిపిన రాజశేఖర్ చాన్నాళ్ల విరామం అనంతరం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నటించిన “పి.ఎస్.వి గరుడవేగ”తో హీరోగా తన పూర్వ వైభవాన్ని సంపాదించుకొన్న విషయం తెలిసిందే. మళ్ళీ అదే ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో విలన్ గా నటించడానికి రెడీ అంటున్నాడు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రామ్ హీరోగా ఓ అడ్వెంచర్ థ్రిల్లర్ ఇటీవల మొదలైన విషయం తెలిసిందే. స్రవంతి రవికిషోర్ నిర్మించనున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మరో నాలుగైదు నెలల్లో మొదలవ్వనుంది.

ఈ చిత్రంలో కీలకపాత్ర అయిన ప్రతినాయక పాత్రను తొలుత ఓ తమిళ కథానాయకుడి చేత పోషింపజేయాలని అనుకొన్నప్పటికీ.. ప్రవీణ్ సత్తారుకి రాజశేఖర్ తో ఉన్న స్నేహబంధం, రాజశేఖర్ కి విలన్ గా ప్రేక్షకుల్ని సరికొత్తగా పలకరించాలన్న కోరిక కూడా బలంగా ఉండడంతో ఈ ఆఫర్ ను రాజశేఖర్ స్వీకరించినట్లు తెలుస్తోంది. జగపతిబాబు తరహాలోనే రాజశేఖర్ కూడా స్టైలిష్ విలన్ గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తాడేమో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus