Rajinikanth: వా తలైవా వా.. పారిశుద్ధ్య కార్మికురాలిని ఇంటికి పిలిచి సన్మానించి

మంచి చేయాలి, మంచి చేసిన వారిని అభినందించాలి. మన పెద్దలు మనకు చెప్పే పాఠాల్లో ఇదొకటి. ఈ రెండు పనులు బాగా చేసే వాళ్లు చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో ప్రముఖ నటుడు రజనీకాంత్‌ ఒకరు. తనకు దొరికిన బంగారాన్ని పోలీసులకు అప్పగించిన ఓ పారిశుద్ధ్య కార్మికురాలి నిజాయతీని మెచ్చుకోవడంతో పాటు, ఓ బంగారు గొలుసును కానుకగా కూడా అందించారు. ఈ గౌవరం అందుకున్న కార్మికురాలలి పేరు పద్మ. చెన్నై మహానగర పాలకసంస్థలో ఆమె విధులు నిర్వర్తిస్తున్నారు.

Rajinikanth

పద్మకు ఇటీవల రోడ్డుపై 45 తులాల బంగారం దొరికిన విషయం తెలిసిందే. వెంటనే ఆ బంగారాన్ని పోలీసులకు అప్పగించి మన్ననలు అందుకున్న ఆమెను ఇంటికి పిలిచి ఆప్యాయంగా మాట్లాడి, సన్మానించారు. మరోవైపు పద్మకు భారత తపాలా శాఖ అరుదైన గౌరవాన్ని అందించింది. ఆమె ఫొటోతో పోస్టల్‌ స్టాంపును విడుదల చేసింది. ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ ద్వారా ఆమెకు రూ.15 లక్షల ప్రమాద బీమా పాలసీని కూడా అందించింది. ఆమెను అభినందిస్తూ ప్రభుత్వం తరఫున రూ.లక్ష నగదు బహుమతిని కూడా అందించారు.

ఓ ప్రైవేటు సంస్థ తరఫున గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌లో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్నారు పద్మ. జనవరి 11న టీ నగర్‌లో విధుల్లో ఉండగా రోడ్డుపై ఓ బ్యాగు కనిపించింది. తెరిచి చూస్తే బంగారు ఆభరణాలు కనిపించాయి. వెంటనే ఆ బ్యాగును తీసుకెళ్లి పాండి బజార్‌లో పోలీస్‌ స్టేషన్‌లో అప్పగించారు. పోలీసులు దర్యాప్తు చేసి ఆ బ్యాగును యజమానికి అందజేశారు. అందులోని నగల విలువ రూ.45 లక్షలు అని అప్పుడు తెలిసింది.

పద్మ జీవితంలో ఇలాంటి నిజాయతి పని ఇంకొకటి ఉంది. కరోనా సమయంలో పద్మ భర్త సుబ్రమణి మెరీనా బీచ్‌ సమీపంలో పారిశుద్ధ్య పనులు చేస్తుండగా రూ.1.5 లక్షల నగదు దొరికింది. అప్పుడు ఆయన కూడా ఆ డబ్బును పోలీసులకు అప్పగించారు. ఇప్పుడు పద్మ ఇలా తన నిజాయతి నిరూపించుకున్నారు. దీనికి గాను ఆమెను ఎంత ప్రశంసించినా తక్కువే.

‘ఆరెంజ్‌’ టైటిల్‌ వెనుక అసలు అర్థం ఇదే.. ఇంత ఆలోచించారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus