Rakul Preet: రకుల్ ప్రీత్ సింగ్ కు మరోసారి షాక్ ఇచ్చిన ఈడీ..!

  • December 16, 2022 / 07:18 PM IST

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కు మరోసారి ఈడీ నోటీసులు పంపి షాకిచ్చింది. డ్రగ్స్ కేసు వ్యవహారంలో ఇదివరకు ఓసారి ఆమెకు నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. విచారణకు కూడా ఆమె హాజరైంది. అయితే మధ్యలోనే ఆమె వెళ్ళిపోయింది. నన్ను అనవసరంగా విచారణకి పిలిచారు అంటూ ఆమె మండిపడుతూ కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. అయితే అలా విచారణ మధ్యలో వెళ్ళిపోయినందుకు… ఈడీ మండిపడింది కూడా..! అయితే ఇప్పుడు మరోసారి ఈడీ ఆమెను విచారణకు పిలిచింది.

దీంతో ఈ టాపిక్ పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. డిసెంబర్ 19న రకుల్ విచారణకు హాజరు కావాలని నోటీసులో ఉందట. అంతేకాదు ఈసారి విచారణ పూర్తిస్థాయిలో ఉండబోతుందట. రకుల్ తో పాటు డ్రగ్స్ కేసులో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది. అంతేకాదు ఆర్థిక లావాదేవీల పై కూడా రోహిత్ ను విచారించబోతుందట ఈడీ. ఈయన కూడా డిసెంబర్ 19నే హాజరు కావాల్సి ఉంది.

2021లో బెంగళూరులో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఈ క్రమంలో కర్ణాటక పోలీసులు ఓ నైజీరియన్ ను అరెస్ట్ చేశారు. అటు తర్వాత అతన్ని విచారించగా కొంతమంది పెద్ద వాళ్ళ పేర్లు బయటపడ్డాయట.అలాగే మనీ ట్రాన్సాక్షన్స్ కూడా వారి ఖాతా నుండి జరిగినట్టు సమాచారం. అలాగే మొదటి విచారణలో తెలంగాణకు చెందిన పలువురు వ్యాపారులు, శాసనసభ్యులు, సినీ ప్రముఖులు కూడా ఉన్నట్టు బయటపడింది.

దీంతో డ్రగ్స్ కేసులో మొత్తం 12 మందికి ఈడీ నోటీసులు వెళ్లాయి. టాలీవుడ్ నుండి పూరి జగన్నాథ్, ఛార్మి, రవితేజ,ముమైత్ ఖాన్, నందు, తనీష్, తరుణ్, నవదీప్ అలాగే రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఉన్నట్లు తెలుస్తుంది. మరి రకుల్ ను ఈడీ ఎన్ని గంటలు విచారిస్తుందో చూడాలి.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus