Ram Charan: ఆ దర్శకుడే కావాలంటున్న టాలీవుడ్ హీరోలు..?

  • May 25, 2021 / 02:02 PM IST

యశ్ హీరోగా తెరకెక్కిన కేజీఎఫ్ సినిమాతో ఓవర్ నైట్ లో ప్రశాంత్ నీల్ స్టార్ డైరెక్టర్ గా గుర్తింపును సొంతం చేసుకున్నారు. కేజీఎఫ్ సినిమాలో తొలి సన్నివేశం నుంచి చివరి సన్నివేశం వరకు ప్రశాంత్ నీల్ సినిమాను అద్భుతంగా తెరకెక్కించడంతో పాటు హీరో యశ్ ను బాగా ఎలివేట్ చేశారని ప్రేక్షకులు అభిప్రాయపడ్డారు. కేజీఎఫ్ కు సీక్వెల్ గా కేజీఎఫ్2 తెరకెక్కగా ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకున్న కేజీఎఫ్2 ఈ ఏడాది జులై 16వ తేదీన రిలీజ్ కానుంది.

ప్రస్తుతం ప్రభాస్ తో సలార్ సినిమాను తెరకెక్కిస్తున్న ప్రశాంత్ నీల్ ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ తో ఒక సినిమా, బన్నీతో ఒక సినిమాను తెరకెక్కించనున్నారు. బన్నీ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. అయితే రామ్ చరణ్ కూడా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తోంది. వచ్చే ఏడాది ఈ కాంబినేషన్ లో సినిమా ప్రకటన వెలువడినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

మరోవైపు చరణ్ సినిమాల ఎంపిక విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ తో కొత్త ప్రాజెక్ట్ ను ప్రకటించిన చరణ్ ఈ సినిమా తరువాత ఎవరి దర్శకత్వంలో నటిస్తారనే సంగతి తెలియాల్సి ఉంది. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా వచ్చే క్రేజ్ ను మరింత పెంచే ప్రాజెక్ట్ లను ఎంపిక చేసుకోవాలని చరణ్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు టాలీవుడ్ హీరోలంతా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటించడానికి ఆసక్తి చూపిస్తుండటం గమనార్హం.

Most Recommended Video

10 మంది టాలీవుడ్ సెలబ్రిటీలు మరియు వారి అలవాట్లు..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!
ఈ 15 మంది సెలబ్రిటీలు బ్రతికుంటే మరింతగా రాణించే వారేమో..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus