తండ్రి సినిమాని రీమేక్ చేసే పనిలో రామ్ చరణ్ తేజ్

  • July 26, 2017 / 07:06 AM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం 1985 సినిమా చేస్తున్నారు. సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. హైదరాబాద్ లో  వేసిన విలేజీ సెట్ లో మూడో షెడ్యూల్ నిన్న మొదలయింది. ఈ చిత్రాన్ని కంప్లీట్ చేసిన వెంటనే చెర్రీ హ్యాట్రిక్ డైరక్టర్ కొరటాల శివతో మూవీ చేయనున్నారు. దీనిని చరణ్ మ్యాట్నీ ఎంటర్ టెయిన్ మెంట్స్ బ్యానర్ తో కలిసి నిర్మించనున్నారు. ఈ మూవీ తర్వాత ప్రాజక్ట్ ని కూడా రామ్ చరణ్ ఒకే చెప్పినట్లు తెలిసింది. సినిమా చూపిస్త మామ, నేను లోకల్ సినిమాల్తో ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిన దర్శకుడు త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

ఈ సినిమా గురించి ఆసక్తికర విషయం బయటికి వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి అలనాటి సూపర్ హిట్ మూవీ మంత్రి గారి వియ్యంకుడు సినిమా నుంచి మూల కథని తీసుకున్నట్లు ఫిలిం నగర్ వాసులు చెబుతున్నారు. ఆ స్టోరీని  నేటి కాలానికి అనుగుణంగా మార్పులు చేసే పనిలో డైరెక్టర్ నక్కిన త్రినాథరావు ఉన్నారంట. ఆ స్క్రిప్ట్ నచ్చితేనే సినిమా చేస్తానని చరణ్ కండిషన్ పెట్టినట్లు టాక్. ఇందులో ఎంత నిజం ఉందొ తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus