స్టాట్యుటరీ వార్నింగ్‌ ఇచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’

  • July 16, 2019 / 03:29 PM IST

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఇస్మార్ట్ శంకర్’. జూలై 18న విడుదల కాబోతున్న ఈ చిత్రానికి సంభందించిన సెన్సార్ పనులు పూర్తయ్యాయి. ఈ చిత్రాన్ని సెన్సార్ బోర్డ్ వారు ‘A’ సర్టిఫికేట్ ను జారీ చేశారు. మరి ఇవ్వరా…! ఈ చిత్రంలో డబుల్ మీనింగ్ డైలాగులు, రొమాంటిక్ సీన్లు అలా ఉన్నాయి మరి. ఇదిలా ఉంటే.. గతంలో పూరి జగన్నాథ్ తెరకెక్కించిన సూపర్ హిట్ చిత్రాలు ‘పోకిరి’ ‘బిజినెస్ మేన్’ లకు కూడా ‘A’ సర్టిఫికెట్ నే ఇచ్చారు సెన్సార్ బోర్డ్ సభ్యులు. అయితే ఈ చిత్రాలు లాగే ఈ చిత్రం కూడా ఘనవిజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు నిర్మాతలు పూరి జగన్నాథ్, ఛార్మీ. ఈ క్రమంలో.. తాజాగా రామ్ చేసిన ఓ ట్వీట్ సంచలనంగా మారింది.

సినిమా ప్రారంభంలో వేసే… స్టాట్యుటరీ వార్నింగ్‌ తరహాలో ” ‘ధూమపానం, మద్యపానంతో పాటూ ‘ఇస్మార్‌ శంకర్‌’ లా నిజజీవితంలో వ్యవహరించటం కూడా ఆరోగ్యానికి హానికరం. ‘ఇస్మార్‌ శంకర్‌’ ఓ కల్పిత పాత్ర అనే తెలుసుకోగలిగినంత ఇస్మార్ట్‌గా వ్యవహరించండి ’ అంటూ ట్వీట్‌ చేశాడు రామ్. ఇక ఈ చిత్రంలో నిధి అగర్వాల్, నభా నటేష్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటీకే మణిశర్మ సంగీతంలో తెరకెక్కిన పాటలకు అద్భుతమైన స్పందన లభించింది. మరి ఇంకో రెండు రోజుల్లో విడుదలయ్యే సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus