జెమినీ గణేశన్ ని వెనకేసుకొచ్చిన రమాప్రభ

  • June 3, 2018 / 07:54 AM IST

తెలుగువారి అభిమాన నటి సావిత్రి జీవితకథను నాగ్ అశ్విన్ వెండితెరపై అద్భుతంగా చూపించారు. రెండేళ్లు శ్రమించి మహానటి సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అయి సంచలన విజయం సాధించింది. సినీ ప్రముఖుల ప్రశంసలతో పాటు.. కలక్షన్ల వర్షం కురిపించింది. సావిత్రి తాగుడుకు బానిసకావడానికి భర్త జెమినీ గణేశన్ కారణమని సినిమాలో చూపించారు. దీనిపై ఆయన మొదటి భార్య కుమార్తెలు విమర్శించిన సంగతి తెలిసిందే. తాజాగా తెలుగు సీనియర్ హాస్య నటి రమాప్రభ సినిమాలో చూపించింది అబద్ధమని సంచలన కామెంట్స్ చేసింది. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూ లో ఆమె మాట్లాడుతూ.. “సావిత్రిలో ఎంతో మొండితనం ఉండేది . అయినా చివరివరకూ ఆమెను ప్రేమించిన ఒకే ఒక వ్యక్తి జెమినీ గణేశన్.

మహానటి సినిమాలో చూపించినట్టుగా సావిత్రికి తాగుడును అలవాటు చేసింది జెమినీ గణేశన్ కాదు. హాస్పిటల్లో సావిత్రి దగ్గరే కూర్చుని జెమినీ గణేశన్ ఎంతో బాధపడేవాడు. ఇదంతా ప్రత్యక్షంగా దగ్గర నుంచి చూసినదాన్ని నేను. జెమినీ గణేశన్ మొదటి భార్య అలమేలు సావిత్రిని ఎంతో బాగా చూసుకునేది .. ఆమెతో సావిత్రి కూడా అంతే స్నేహంగా ఉండేది. జెమినీ గణేశన్ పిల్లలంతా కూడా కలిసిమెలిసి ఉండేవారు.” అని వెల్లడించింది. సావిత్రి మానసికంగా కుంగిపోవడానికి సినిమాలు నిర్మించడమే కారణమని తెలిపింది. “సినిమాలు తీయడం వల్లనే సావిత్రి ఎక్కువగా నష్టపోయింది. వద్దని జెమినీ ఎంతగా చెప్పినా ఆమె వినిపించుకోలేదు. నేను ఆ సమయంలో సావిత్రి దగ్గరే ఉండటం వలన నాకు నిజాలు తెలుసు” అని రమాప్రభ స్పష్టం చేసింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus