ఆ మలయాళం రీమేక్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రానా,రవితేజ..!

  • June 10, 2020 / 05:40 PM IST

మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘అయ్యప్పనుమ్ కోశియమ్’ చిత్రం రీమేక్ రైట్స్ ను ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ వారు కొనుగోలు చేసి చాలా రోజులయ్యింది. ఓ హీరోగా రానా ఎప్పుడో ఫిక్స్ అయ్యాడు. ఇక మరో హీరోగా బాలకృష్ణ నటిస్తారని ప్రచారం జరిగింది. కానీ బాలయ్య అంత ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో రవితేజను సంప్రదించారట. ఈ రీమేక్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట మన మాస్ మహారాజ్. ‘సురేష్ ప్రొడక్షన్స్’ వారు కూడా ఈ రీమేక్ కు సహా నిర్మాతలుగా వ్యవహరిస్తారని టాక్ నడుస్తుంది. ఆగష్టు నుండీ ఈ చిత్రం షూటింగ్ మొదలు కానుందట.

జూలై 15 నుండీ షూటింగ్ లకు ప్రభుత్వం కూడా పెర్మిషన్ ఇచ్చిన నేపథ్యంలో.. ఓ 2 వారాల పాటు పరిస్థితిని గమనించి ఆగష్టు నుండీ ఈ రీమేక్ షూటింగ్ ను మొదలు పెట్టాలని నిర్మాతలు భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ రీమేక్ కు ‘స్వామిరారా’ ‘దోచేయ్’ ‘కేశవ’ ‘రణరంగం’ వంటి చిత్రాలను తెరకెక్కించిన సుధీర్ వర్మ డైరెక్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. అది నిజమో.. కాదో.. అనే క్లారిటీ త్వరలోనే నిర్మాతలు ఇవ్వనున్నారు.

తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగినట్టు ‘అయ్యప్పనుమ్ కోశియమ్’ కథలో కొన్ని మార్పులు కూడా చేయబోతున్నారట. ఇదిలా ఉంటే.. రవితేజ ‘క్రాక్’ చిత్రం షూటింగ్ ను ఫినిష్ చెయ్యాల్సి ఉంది. మరోపక్క రానా కూడా ‘విరాటపర్వం’ షూటింగ్ ఫినిష్ చెయ్యాల్సి ఉంది. ఆగష్టు లోపే వీరిద్దరూ తమ ప్రాజెక్ట్ లను కంప్లీట్ చేసి ‘అయ్యప్పనుమ్ కోశియమ్’ రీమేక్ షూటింగ్ లో జాయినవ్వనున్నారని సమాచారం.

Most Recommended Video

మేకప్‌ లేకుండా మన టాలీవుడ్ ముద్దుగుమ్మలు ఎలా ఉంటారో తెలుసా?
జ్యోతిక ‘పొన్‌మగల్‌ వందాల్‌’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus