రానా, గుణశేఖర్ కాంబినేషన్లో మూవీ

  • February 21, 2018 / 05:37 AM IST

భారీ బడ్జెట్ తో రుద్రమదేవి సినిమాని తెరకెక్కించిన గుణశేఖర్ అందరి ప్రశంసలు అందుకున్నారు. ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ మళ్లీ భారీ బడ్జెట్ కథనే ఎంచుకున్నారు. దేవతలందరినీ జయించిన హిరణ్యకశిపుడు కథతో సినిమా తీయడానికి సిద్ధమవుతున్నారు. ఇందులో హిరణ్యకశిపుడుగా రానా నటించనున్నట్లు తెలిసింది. బాహుబలి సినిమాల తర్వాత హీరోగా నేనే రాజు నేనే మంత్రి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న రానాకి ఈ కథ నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అలాగే పౌరాణిక కథల్లో నటించి పేరు తెచ్చుకోవాలని రానా ఎప్పటినుంచో అనుకుంటున్నారు.

గుణశేఖర్ దర్శకత్వంలో రుద్రమదేవి వంటి చారిత్రాత్మక కథలో రానా నటించి మెప్పు పొందారు. ఇప్పుడు మళ్లీ అతని దర్శకత్వంలో ఈ సినిమా చేయనున్నారు. రానా కి ఇతర భాషల్లో ఉన్న క్రేజ్ ని బట్టి ఈ సినిమాని ఏకకాలంలో నాలుగు భాషల్లో 150 కోట్లతో గుణ టీం వర్క్స్ బ్యానర్ పై నిర్మించనున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ కంప్లీట్ చేసిన గుణశేఖర్ ఆగష్టు నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఈ చిత్రానికి పనిచేసే టెక్నీషియన్లు, నటించే నటీనటుల వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus