ఆ ఇబ్బందిని రంగస్థలం చిత్ర బృందం అధిగమిస్తుందా ?

  • March 20, 2018 / 09:46 AM IST

1980 నాటి కాలంలో పల్లెటూరిలో ప్రేమ, పగలు, అభిమానం, అసూయలు ఎలా ఉండేవో? రంగస్థలం (Rangasthalam 1985) సినిమా ద్వారా సుకుమార్ కళ్ళకు కట్టనున్నారు. మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌, సమంత హీరో హీరోయిన్స్ గా నటించిన ఈ మూవీ అనేక ఇబ్బందులను అధిగమించి షూటింగ్ పూర్తి చేసింది. తాజాగా మరో సమస్య చిత్ర యూనిట్ ని తెగ ఇబ్బంది పెడుతోంది. అదే సినిమా రన్ టైమ్. రంగస్థలం సినిమా పూర్తిగా ఎడిటింగ్ చేసిన తర్వాత రన్ టైమ్ రెండుగంటల నలభై ఐదు నిముషాలు వచ్చిందంట. ఇంట్రవెల్ బ్రేక్ తో కలిపితే మూడు గంటలు.

ఇప్పటి కాలంలో ప్రేక్షకులను రెండున్నర గంటల పాటు కూర్చోబెట్టడమే కష్టమైపోతోంది. మరి మూడు గంటల పాటు సినిమా చూడగలరా ? అనే సందేహం చిత్ర బృందాన్ని కలవరపెడుతోంది. దీని గురించి సుకుమార్. రామ్ చరణ్ తో పాటు చిరంజీవితో కూడా చర్చలు చేస్తున్నారు. సినిమాని చూసి ఎక్కడైనా అనవసరపు సీన్స్ ఉంటే తీసెయ్యాలా? కట్స్ లేకుండా సినిమాని రిలీజ్ చేయాలా? అనేది త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు. ఈ నెల 30 న సినిమా రిలీజ్ కానుంది కాబట్టి సెన్సార్ వద్దకు ఈ వారంలోనే వెళ్లనుంది. అప్పటి లోపున ఈ సినిమా నిడివిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus