రంగస్థలం కథలో కొత్త ట్విస్ట్

  • February 22, 2018 / 09:44 AM IST

సుకుమార్ ప్రేమ కథలతోనే కెరీర్ ప్రారంభించారు. డిఫెరెంట్ లవ్ స్టోరీ లను తెరకెక్కించి విజయాలను అందుకున్నారు. అటువంటి డైరక్టర్ రామ్ చరణ్ తో సినిమా అనగానే అందరూ అది ప్రేమ కథ అనుకున్నారు. పైగా పాతికేళ్ల క్రితం జరిగే కథ కావడంతో లవ్ స్టోరీ అని భావించారు. సమంత రోల్ కోసం ప్రత్యేకంగా రిలీజ్ చేసిన టీజర్ లోను చిట్టిబాబు.. రామ లక్ష్మి తన గుండెని గోలెట్టేసిందని చెప్పడంతో ఇక అందరూ రంగస్థలం పక్కా ప్రేమ కథని ఫిక్స్ అయ్యారు. అయితే అసలు ఇది ప్రేమ కథ కాదంట. ఇందులో చిట్టిబాబు.. రామలక్ష్మి మధ్య ప్రేమ నడిచినప్పటికీ.. పగ ప్రతీకారాల చుట్టూ నడుస్తుందని ఫిలిం నగర్ వాసులు చెప్పారు.

తన అన్న హత్య వెనుక గల కారణాన్ని, చంపిన వారిని చెవిటివాడిన హీరో ఎలా పట్టుకున్నారన్నదే కీలక పాయింట్ అని సమాచారం. అయితే ఈ స్టోరీలైన్ లో ఎంత నిజముందో ఇప్పుడే చెప్పలేము. మైత్రిమూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాలో ఆది పినిశెట్టి, అనసూయ, జగపతిబాబులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్న ఈ చిత్రం మార్చి 30 న థియేటర్లోకి రానుంది. ధృవ సినిమా తర్వాత రామ్ చరణ్ చేస్తున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus