రంగస్థలం షూటింగ్ పూర్తి కాలేదు

  • January 20, 2018 / 12:02 PM IST

2017 లో రామ్ చరణ్ నటించిన చిత్రం ఏదీ రాలేదు. ధృవ వంటి విజయం తర్వాత వెంటనే సినిమా వస్తుందని భావించిన మెగా అభిమానులకు నిరాశే మిగిలింది. సుకుమార్ దర్శకత్వంలో చరణ్ సినిమా ఆలస్యంగా మొదలు కావడమే కాదు.. వివిధ కారణాలతో సినిమా ఆలస్యం అయిపోతుంది. రీసెంట్ గా రంగస్థలం సినిమా షూటింగ్ ప్యాచ్ వర్క్ లు కూడా పూర్తి అయిపోయాయి. కానీ సుకుమార్ రీ షూట్ పెట్టారు. కారణం ఏమిటని ఆరా తీయగా అసలు విషయం తెలిసింది. ఇది పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో సాగే కథ కాబట్టి గోదావరి జిల్లాలోని వివిధ గ్రామాల్లో మొదటి షెడ్యూల్ పూర్తి చేశారు.

అయితే అభిమానుల తాకిడి ఎక్కువగా ఉండడంతో భారీ వ్యయంతో హైదరాబాద్ స్టూడియోలో పల్లెటూరి సెట్ ని వేశారు. ఇక్కడే ఎక్కువగా సీన్లు తెరకెక్కించారు. ఈ సీన్లు ఎడిటింగ్ చేసి చూసుకుంటే కొన్ని చోట్ల సుకుమార్ కి ఆర్టిఫిసియల్ గా అనిపించిందంటా. అందుకే గోదావరి జిల్లాల్లో ఆ సన్నివేశాలను మళ్ళీ తీయాలని అనుకున్నారు. ఇదే విషయాన్నీ రామ్ చరణ్ కి చెప్పడంతో అతను ఒకే చెప్పినట్లు సమాచారం. పదిరోజుల్లో ఆ సీన్లు పూర్తి చేయాలనీ సుకుమార్ డిసైడ్ అయ్యారు. లేకుంటే ఎడిటింగ్ ఆలస్యం అవుతుందని చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, ఆది, అనసూయ కీలకరోల్స్ పోషిస్తున్నారు. రాక్ స్టార్ దేవీ శ్రీప్రసాద్ సంగీతమందిస్తున్న ఈ మూవీ మార్చి 30 న రిలీజ్ కానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus