ఎన్టీఆర్ గురించి అనేక సంగతులు చెప్పిన రాశీఖన్నా!

  • September 15, 2017 / 04:47 PM IST

ఢిల్లీ బ్యూటీ రాశీఖన్నా ఊహలు గుసగుసలాడే చిత్రంతో అడుగుపెట్టి స్టార్ హీరోల సరసన నటించే స్థాయికి ఎదిగింది. ప్రస్తుతం జై లవకుశ సినిమాలో ఆమె ఎన్టీఆర్ సరసన నటించింది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఈనెల 21 న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మీడియాతో తన క్యారక్టర్, ఎన్టీఆర్ గురించి ఆసక్తికర సంగతులు చెప్పింది. ” ‘జై లవకుశ’లో నాది ‘ప్రియ’ పాత్ర.  నేను మ్యారేజ్‌ బ్యూరో నిర్వహిస్తుంటా. ‘లవ కుమార్‌’ని ప్రేమిస్తా.  గ్లామర్‌, నటన రెండింటికీ ప్రాధాన్యం ఉన్న పాత్ర ఇది. మంచి గుర్తింపు తెస్తుందని ఆశిస్తున్నా.” అని రాశీ ఖన్నా వివరించింది. ” ఎన్టీఆర్ చేసిన మూడు పాత్రలు బాగుంటాయి. ‘జై’ పాత్ర ప్రత్యేకంగా అనిపించింది. ఎన్టీఆర్‌ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేశారు. ప్రతి పాత్రకు తగ్గట్టు మారడం అంత తేలికైన విషయం కాదు.

ఆయన్ని చూసి చాలా నేర్చుకున్నా” అని తారక్ ని  అభినందించారు. ఇక ఎన్టీఆర్ తో కలిసి డ్యాన్స్ వేయడం గురించి మాట్లాడుతూ ” ఎన్టీఆర్ తో డ్యాన్స్ చేయడం కష్టమనిపించింది. అయినా చేయగలిగా” అని తెలిపారు. చివరగా ఎన్టీఆర్, తనకి మధ్య జరిగిన సంభాషణను పంచుకుంది. ”ఒకపక్క సినిమాలో నటిస్తున్నారు? మరోపక్క బిగ్‌బాస్‌ షో చేస్తున్నారు. అయినా ఇంత ఉత్సాహంగా ఎలా ఉన్నారు?’ అని ‘జై లవకుశ’ సెట్‌లో ఎన్టీఆర్‌ని అడిగా… దీనికి ఆయన ‘జీవితంలో ఏదైనా అనుకుంటే సాధించాలి. అదే శ్వాసగా సాగాలి. అలానే చేస్తున్నా’ అని సమాధానం ఇచ్చారు”.. ఆయన తారకమంత్రం అదేనని అప్పుడే గుర్తించగలిగానని వివరించారు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus