“మహేష్” తో జత కట్టనున్న రష్మి

  • March 3, 2016 / 06:04 AM IST

సెక్సీ యాంకర్ రేష్మికి సూపర్ ఆఫర్ తగిలింది. ఇంకా ఆమె నటించిన ‘గుంటూర్ టాకీస్’ సినిమా విడుదల కాకుండానే సాక్షాత్తూ టాలీవుడ్ ప్రిన్స్ సరసన నటించే అవకాశం దక్కించుకుంది. వివరాల్లోకి వెళితే…ప్రస్తుతం మహేష్ బాబు “బ్రహ్మోత్సవం” సినిమాలో బిజీగా ఉన్నాడు. ఇక ఆ సినిమా అయిపోయిన అనంతరం తమిళ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నట్లు టాలీవుడ్ నుంచి వినిపిస్తున్న మాట. ఇక ఈ సినిమాలో రేష్మి ఒక ప్రధాన పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఇక మురగదాస్ ఈసినిమాకు సంబంధించిన నటీనటుల వేట కూడా ప్రారంభించాడు.

ఈనేపధ్యంలో ఒక కీలక పాత్రకు రష్మి సరిపోతుంది అన్న ఆలోచన రావడంతో ఈసినిమా యూనిట్ సభ్యులు రష్మిని సంప్రదిస్తున్నట్లు టాక్. అదే క్రమంలో రేష్మి సైతం ఈ పాత్రను చేసేందుకు ఒప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయినా ప్రిన్స్ తో సినిమా చేయడం అనేది అందాల భామల డ్రీమ్ అలాంటిది ఇలాంటి అవకాశం వస్తే ఎవరైనా ఒదులు కుంటారా చెప్పండి, అందుకే రేష్మి వెంటనే ఒప్పుకుంది. ప్రస్తుతం రేష్మి ‘గుంటూర్ టాకీస్’ చిత్రం తరువాత త్వరలో ఒక హర్రర్ సినిమాలో కూడ నటించబోతోంది అని సమాచారం. ఏది ఏమైనా… ఈ హాట్ బ్యూటీ పండగ చేసుకుంటుంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus