Rashmika: వైరల్ అవుతున్న రష్మిక మందన్నా పోస్టు..!

  • October 29, 2023 / 11:18 PM IST

కిరిక్ పార్టీ సినిమాతో కన్నడ సినీపరిశ్రమలోకి అడుగుపెట్టింది రష్మిక మందన్నా. ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకంటూ స్టార్ డమ్ సంపాదించుకుంది. ముఖ్యంగా తెలుగులో ఈ బ్యూటీకి ఫుల్ క్రేజ్ వచ్చేసింది. ఛలో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన.. ఆ ముద్దుగుమ్మకు గుర్తింపు తెచ్చింది మాత్రం గీతా గోవిందం సినిమానే. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. దీంతో తెలుగులో బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్ అందుకుంటూ వాటిని సక్సెస్ లుగా మలుచుకుంటూ ఎందో ప్రేక్షకాభిమానుల ప్రేమతో కొనసాగుతుంది.

ఇక పుష్ప సినిమా అమ్మడి రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. సౌత్ ఇండస్ట్రీలోనే కాకండా బాలీవుడ్ లోనూ ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. దీంతో అటు హిందీలోనూ వరుస అవకాశాలు అందుకుంది. మిషన్ మజ్ను, గుడ్ బై చిత్రాలతో అలరించిన ఈ బ్యూటీ.. ఇప్పుడు యానిమల్ సినిమాతో బీటౌన్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఇప్పటికే ఈసినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ అంచనాలను పెంచేశాయి. ఇందులో రణబీర్ కపూర్ హీరోగా నటించగా.. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించారు.

ఇదిలా ఉంటే.. ఎప్పుడూ సినిమాలతో బిజీగా ఉండే (Rashmika) రష్మిక.. తాజాగా తన ఇన్ స్టా ఖాతాలో ఆసక్తికర పోస్ట్ చేసింది . ప్రస్తుతం తను ట్రావెలింగ్ చాలా మిస్ అవుతున్నానంటూ చెప్పుకొచ్చింది. ” నేను ప్రయాణాన్ని చాలా మిస్ అవుతున్నాను. ప్రయాణం చేసే అబ్బాయిల గురించి ఒక చిన్న విషయం. ఎప్పుడైనా మీకు కొంత సమయం దొరికితే ప్రయాణం నిర్ధారించుకోండి.

ఎక్కడికైనా, ఇలా .. మీ స్వస్థలానికి లేదా మీ స్నేహితుల ఇళ్లకు లేదా మీ కలల గమ్యస్థానానికి లేదా కుటుంబంతో లేదా ఒంటరిగా ఎక్కడైనా.. ఏదైనా కానీ ఎక్కడైనా సురక్షితంగా. ఎందుకంటే ప్రయాణం మీ జ్ఞానాన్ని, మనస్సును ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది. ఇవే కాకుండా విభిన్న ఆహారాలు, సంస్కృతులు, మతాలు, జీవన విధానాలను తెలియజేస్తుంది. ఇది అద్భుతం. మీరందరూ ప్రయాణం చేయాలని కోరుకుంటున్నాను.” అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం రష్మిక చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతుంది.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus