వరుసగా రెండు సినిమాల్లో నక్సలైట్ పాత్రలో కనిపించబోతున్న సాయి పల్లవి..!

  • September 11, 2020 / 05:54 PM IST

సమంత తరువాత టాలీవుడ్లో గోల్డెన్ లెగ్ గా చలామణి అవుతుంది హీరోయిన్ రష్మిక. మూడేళ్ళకే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన రష్మిక ఇప్పుడు ఆచి తూచి సినిమాలను ఎంచుకుంటుంది. ‘డియర్ కామ్రేడ్’ దెబ్బకి ప్రయోగాత్మక చిత్రాలకు దూరంగా ఉండాలనుకుంటుందట ఈ కన్నడ బ్యూటీ. ‘ప్రస్తుతం కమర్షియల్ సినిమాల్లో మాత్రమే నటిస్తాను’ అంటూ దర్శక నిర్మాతలకు తేల్చి చెప్పేస్తుందట. ఈ క్రమంలో రాంచరణ్ సరసన నటించే అవకాశం వచ్చినా.. నో చెప్పినట్టు తాజా సమాచారం.

వివరాల్లోకి వెళితే.. ‘ఆచార్య’ చిత్రంలో చరణ్ కూడా ఓ కీలక పాత్ర పోషించబోతున్నట్టు దర్శకుడు కొరటాల శివ ప్రకటించిన సంగతి తెలిసిందే.కథ పరంగా ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఎపిసోడ్ లో చరణ్ కనిపిస్తాడని తెలుస్తుంది. ఇతని కథలో హీరోయిన్ కు కూడా ఛాన్స్ ఉందట. చరణ్ కు జోడీగా నటించే హీరోయిన్.. నక్సలైట్ పాత్రలో కనిపించాల్సి ఉందట. ఈ క్రమంలో రష్మికను సంప్రదించగా ఆమె 3 ప్రాజెక్టులతో బిజీగా ఉన్నందువల్ల డేట్స్ అడ్జస్ట్ చెయ్యలేను అని చెప్పిందట.

దాంతో దర్శకనిర్మాతలు సాయి పల్లవిని సంప్రదిస్తున్నట్టు టాక్ వినిపిస్తుంది. అయితే ఆమె ఆల్రెడీ రానా హీరోగా తెరకెక్కుతోన్న ‘విరాటపర్వం’ చిత్రంలో నక్సలైట్ పాత్రను పోషిస్తుంది. మళ్ళీ ‘ఆచార్య’ సినిమాలో తక్కువ నిడివి గల నక్సలైట్ పాత్ర చెయ్యడానికి ఆమె అంగీకరిస్తుందా అనేది తెలియాల్సి ఉంది.

Most Recommended Video

బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
బిగ్‌బాస్‌ 4 హైలెట్స్: బిగ్‌బాస్‌ ఇలా రోజూ అయితే కష్టమే!
బిగ్‌బాస్‌ 4: ఇంట్లో వాళ్లు ఒకరు… బయటి నుంచి ముగ్గురట!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus