కాస్త అతికి పోతున్న కామ్రేడ్ భామ..!

  • August 5, 2019 / 06:55 PM IST

అప్పట్లో హీరోయిన్ ‘కుష్బూ’ కు తమిళనాడు ప్రజలు గుడి కట్టించారు. అలాగే నాకు కూడా అభిమానులు గుడి కట్టిస్తే బాగుండు అంటూ అత్యాశ పడుతోంది ‘డియర్ కామ్రేడ్’ భామ రష్మిక మందన. ప్రస్తుతం తెలుగు, కన్నడ భాషల్లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న రష్మిక మందన. తెలుగులో ఈమెకు మంచి అవకాశాలే వస్తున్నాయి. ఏకంగా మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోల సరసన నటించే అవకాశం కొట్టేసింది ఈ భామ. అయితే ఈమాత్రం దానికే మీ ఏదో పెద్ద సాధించేసాను అనుకుంటుందేమో… ‘కుష్బూ కి గుడి కట్టించినట్లు నాకు కూడా గుడి కట్టిస్తే బాగుణ్ణు అంటూ ఆశపడుతోంది.

నిజానికి కుష్బూ అంటే 80 – 90 వ దశకంలో తన గ్లామర్ తో ఓ ఊపు ఊపేసింది. కుష్బూ గ్లామర్ కు అప్పటి కుర్రాళ్ళు ఫిదా అయిపోయారు అందుకే అలా గుడి కట్టించారు. కానీ రష్మిక మందన ఆ రేంజ్ ఫాలోయింగ్ ఇంకా సంపాదించలేదు. ఇక గ్లామర్ విషయంలో రష్మిక.. ఖుష్బూతో సమానం అస్సలు కాదనే చెప్పాలి. మరి యూత్ ఈమెకు ఎలా గుడి కట్టిస్తారు.. అనే డిస్కషన్స్ కూడా మొదలయ్యాయి. ఇలాంటి కామెంట్స్ రష్మిక చేయకుండా ఉంటేనే బెటర్ అని కూడా సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus