నీటి కాలుష్యం నేపధ్యంలో రష్మిక ఫోటోషూట్ కి మంచి రెస్పాన్స్

  • December 17, 2018 / 03:48 AM IST

సాధారణంగా హీరోయిన్స్ ఫోటోషూట్స్ అంటే అందాలు ఆరబోసి ఆఫర్లు అందుకోవడం కోసమో లేక దర్శకనిర్మాతలు, కథానాయకులను ఇంప్రెస్ చేయడం కోసమో చేయించుకొంటుంటారు. కానీ.. కన్నడ కస్తూరి రష్మిక మందన్న మాత్రం తన కొత్త ఫోటోషూట్ తో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. అందుకు కారణం ఆమె చేయించుకున్న కొత్త ఫోటోషూట్ కాన్సెప్టే. నీటి కాలుష్యం నేపధ్యంలో ప్రజలకు నీటి కాలుష్యం కారణంగా జరుగుతున్న నష్టాలను, భవిష్యత్ తో వారు ఎదుర్కోనే పరిస్థితులను తన ఫోటోల ద్వారా వివరించింది. దాంతో ఈ ఫోటోషూట్ చూడ్డానికి అందంగానే కాక ఆలోచనాత్మకంగానూ మారి ఇంటర్నెట్ లో వైరల్ అయ్యింది. ప్రస్తుతం గూగుల్ టాప్ ట్రెండింగ్ లోనూ స్థానం సంపాదించుకొంది అనుకోండి.

2

ఇంకోపక్క రష్మిక “డియర్ కామ్రేడ్” షూటింగ్ లో బిజీ అయిపోయింది. విజయ్ దేవరకొండతో కలిసి మరోమారు నటిస్తున్న రష్మిక.. త్వరలోనే విజయ్ తో ముచ్చటగా మూడో సినిమా కూడా చేయబోతోందని టాక్. రష్మిక కోసం స్టార్ హీరోలు సైతం వెయిట్ చేస్తుండడం విశేషం. మహేష్ బాబు సినిమాలోనూ అమ్మడికి అవకాశం వచ్చిందని టాక్ ఉన్నప్పటికీ.. ఇప్పటివరకూ కన్ఫర్మేషన్ లేదు.

4

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus