ప్రొఫెసర్ గా మారనున్న రష్మిక..!

  • December 19, 2018 / 07:41 AM IST

ప్రస్తుతం టాలీవుడ్ లో గోల్డెన్ లెగ్ గా పేరు తెచ్చుకుంది హీరోయిన్ రష్మిక మందన. ‘ఛలో’ చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి చిత్రంతోనే సూపర్ హిట్ ను సొంతం చేసుకుంది. అంతే కాదు ‘ఛలో’ చిత్రంలో రష్మిక నటనకు కూడా మంచి మార్కులు పడ్డాయి. ఇక సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ తో చేసిన ‘గీత గోవిందం’ చిత్రం కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో స్టార్స్ దృష్టిలో కూడా పడింది. ఇక వెంటనే ‘నాగ్ -నాని’ కాంబినేషన్లో తెరకెక్కిన క్రేజీ మల్టీ స్టారర్ ‘దేవదాస్’ లో కూడా ఛాన్స్ కొట్టేసింది.ఇప్పుడు రశ్మికకు పెద్ద ఆఫర్లే వస్తున్నాయంట.

రష్మిక తాజాగా మరోసారి విజయ్ దేవరకొండ సరసన ‘డియర్ కామ్రేడ్’ చిత్రంలో నటిస్తుంది. తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు మరో చిత్రానికి సైన్ చేసిందని టాక్ వినిపిస్తుంది. ధృవ సార్జా హీరోగా తెరకెక్కుతోన్న చిత్రంలో రష్మిక ను హీరోయిన్ గా సెలెక్ట్ చేసారంట. ఈ చిత్రంలో ప్రొఫెసర్ పాత్రలో కనిపించనుందట. ‘పొగరు’ అనే టైటిల్తో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్నినంద కిషోర్ డైరెక్ట్ చేస్తుండగా ప్రముఖ నిర్మాత గంగాధర్ నిర్మిస్తున్నట్టు సమాచారం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus