తండ్రితో సీరియస్ డిస్కషన్లో ఉన్న రష్మిక మందన.. ఫోటో వైరల్..!

  • November 19, 2020 / 08:26 PM IST

రష్మిక మందన ‘ఛలో’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.అటు తరువాత ‘గీత గోవిందం’ చిత్రంతో మరో పెద్ద బ్లాక్ బస్టర్ అందుకుంది. దాంతో స్టార్ హీరో మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ లో కూడా ఛాన్స్ కొట్టేసింది. ఆ చిత్రం కూడా బ్లాక్ బస్టర్ అవ్వడంతో.. వరుసగా ఈమెకు స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ‘పుష్ప’ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది రష్మిక.

అటు తరువాత ఎన్టీఆర్- త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కబోతున్న చిత్రంలో కూడా ఈమెను హీరోయిన్ గా అనుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి.ఇక తమిళంలో కూడా కార్తీ ‘సుల్తాన్’ చిత్రంలోనూ నటించింది. త్వరలోనే ఈ చిత్రం విడుదల కాబోతుంది. కన్నడ బ్యూటీ అయినప్పటికీ తెలుగులో కూడా స్టార్ హీరోయిన్ గా ఎదగడం అంటే మాటలు కాదు. సరే ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే.. ఈ లాక్ డౌన్ టైములో తన ఇంట్లోనే ఉంటూ వస్తున్న రష్మిక.. రోజుకో కొత్త ఫోటోని షేర్ చేస్తూ వస్తుంది.

తాజాగా తన తండ్రితో డీప్ డిస్కషన్లో ఉన్న ఫోటోని తన సోషల్ మీడియాలో షేర్ చేసింది రష్మిక. ఈ ఫోటో చూస్తుంటే రష్మిక కూడా నాన్న కూచినే అన్నట్టు అనిపించకమానదు. అయితే దీనికి నెటిజన్లు వేరే కామెంట్లు కూడా పెడుతున్నారు. ‘ఈ కరోనా టైంలో టాలీవుడ్లో వరుసగా పెళ్లిళ్లు జరుగుతున్నాయి కాబట్టి.. రష్మికను కూడా తన తండ్రి పెళ్లి చేసుకోమని చెబుతున్నట్టు ఈ ఫోటో ఉందని’ వారు ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.

Most Recommended Video

ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?
ఈ 12 మంది ఆర్టిస్ట్ ల కెరీర్.. షార్ట్ ఫిలిమ్స్ ద్వారానే మొదలయ్యింది..!
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus