మెహబూబా స్టోరీ ని రవితేజ, రామ్ చేయనన్నారు

  • December 11, 2017 / 11:43 AM IST

ఇండో-పాక్ యుద్ధం.. మధ్య లో ప్రేమ.. ఈ డిఫెరెంట్ స్టోరీ తో పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న సినిమా మెహబూబా. ఈ మూవీ హిమాచల్ ప్రదేశ్, తదితర ప్రాంతాల్లో నిర్విరామంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రం ద్వారా పూరి తనయుడు ఆకాష్ పూరి హీరోగా రీ లాంచ్ అవుతున్నారు. ఎక్కడ కాంప్రమైజ్ కాకూడదని సొంతంగా నిర్మిస్తున్నారు. బెంగళూర్ అమ్మాయి నేహా శెట్టి హీరోయిన్ గా చేస్తున్న ఈ మూవీ గురించి ఓ ఆసక్తికర సంగతి బయటికి వచ్చింది. ఈ కథను మొదట రవితేజకి పూరి జగన్నాథ్ వినిపించారని.. అతనికి నచ్చినప్పటికీ డేట్స్ కుదరకపోవడంతో చేయలేకపోయారని ఆకాష్ పూరి చెప్పారు.

అలాగే రవితేజ తర్వాత ఈ కథ రామ్ వద్దకు వెళ్లిందని.. అతను నో చెప్పడంతో తాను చేస్తున్నట్టు వివరించారు. బాలనటుడిగా అనేక సినిమాలను చేసిన ఆకాష్, ఆంద్ర పోరి ద్వారా హీరోగా అడుగుపెట్టారు. ఆ సినిమా పెద్దగా ఆడలేదు. దీంతో తండ్రి దగ్గర అసిస్టెంట్ డైరక్టర్ గా కొన్నాళ్ళు పని చేసి ఇప్పుడు మళ్ళీ హీరోగా మూవీ చేస్తున్నారు. తమ్ముడు సాయి రామ్ శంకర్ ని హీరోగా నిలబెట్టలేకపోయానని ఆవేదనలో ఉన్న పూరి.. కొడుకునైనా హీరోగా నిలబెట్టాలని కసితో ఈ మూవీ చేస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus