చరణ్, సుకుమార్ చిత్రానికి ఇబ్బందులు

  • February 16, 2017 / 10:13 AM IST

సూపర్ స్క్రీన్ ప్లే తో అదరగొట్టే డైరక్టర్ సుకుమార్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కాంబినేషన్ మూవీకి కొత్త తలనొప్పి వచ్చి పడింది. మైత్రీ మూవీస్‌ వారు నిర్మిస్తున్న ఈ మూవీ జనవరి 30 న పూజా కార్యక్రమాలు జరుపుకుంది. ఈనెల 15 నుంచి రెగ్యులర్ షూటింగ్ జరగాలి. కానీ జరగలేదు. కారణం ఏమిటని ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. ఇది పూర్తిగా పల్లెటూరిలో సాగే కథ. అందుకే  మొగల్తూరు మొనగాడు అనే టైటిల్  పెట్టారు. ఈ మూవీని మొదట పశ్చిమ గోదావరి జిల్లాలో అందమైన గ్రామంలో తీయాలని అనుకున్నారు. కానీ అభిమానుల తాకిడి అధికంగా ఉంటుందని, తమిళనాడు పొల్లాచి లో షూట్ చేద్దామనుకున్నారు.

రీసెంట్ గా అక్కడికి వెళ్లిన సుకుమార్ బృందం ఆ లొకేషన్ కూడా వద్దని చెప్పారు. ఈ ప్రాంతంలో అనేక తెలుగు చిత్రాలు తెరకెక్కించడం వల్ల కొత్త ఫీల్ రాదని భావించి సుకుమార్ అక్కడ వద్దని చెప్పారంటా. ఏ డిస్టబెన్స్ లేని పల్లెటూరి వాతావరం గల కొత్త లొకేషన్ కోసం టీమ్ ఇప్పుడు కేరళకు వెళ్లింది. జగపతిబాబు కీలక పాత్ర పోషిస్తున్న ఇందులో ఆది పినిశెట్టి విలన్ గా నటిస్తున్నారు. చరణ్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతాన్ని అందిస్తున్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus