ఎన్నారై ను పెళ్ళి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్..!

  • December 18, 2019 / 03:54 PM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం ‘మిర్చి’ ద్వారా తన క్రేజ్ ను డబుల్ చేసుకున్న భామ రిచా గంగోపాధ్యాయ్. ‘లీడర్’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ తరువాత రవితేజ ‘మిరపకాయ్’ ‘సారొచ్చారు’ అలాగే నాగార్జున ‘భాయ్’ వంటి చిత్రాల్లో నటించింది. అయితే తరువాత తెలుగులో ఎక్కువగా అవకాశాలు రాకపోవడంతో ఆ తరువాత కన్నడ ఇండస్ట్రీలో కొన్ని సినిమాల్లో నటించింది. ఇక అటు తరువాత ఎందుకో సినిమాలకి గుడ్ బై చెప్పేసి.. విదేశాలకి చదువుకోవడానికి వెళ్ళిపోయింది.

అక్కడ తన సహ విద్యార్థి అయిన జోకుతో.. ప్రేమలో పడినట్టు… అలాగే ఇద్దరికీ నిశ్చితార్థం కూడా అయినట్టు 2019 జనవరిలో రిచా తన సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. ఇక ఇటీవల జోతో.. రిచా వివాహం జరిగినట్టు సమాచారం. క్రిస్టియన్‌ మరియు హిందూ సంప్రదాయాల ప్రకారం కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో వీరి వివాహం జరిగినట్టు తెలుస్తుంది. ఇందుకు సంబందించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

1

2

3

4

5

వెంకీ మామ సినిమా రివ్యూ & రేటింగ్!
అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus