Allu Arjun: గెస్ట్ రోల్ కు బన్నీ ఓకే చెప్పారా!

  • July 17, 2021 / 03:22 PM IST

టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ గతేడాది అల వైకుంఠపురములో సినిమాతో తొలి ఇండస్ట్రీ హిట్ ను సొంతం చేసుకొని పుష్ప సినిమాతో మరో ఇండస్ట్రీ హిట్ సాధించాలని భావిస్తున్నారు. రెండు భాగాలుగా తెరకెక్కనున్న పుష్ప సినిమా తొలి భాగం ఈ ఏడాది రిలీజ్ కానుండగా ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతూ ఇతర భాషల్లో కూడా రిలీజ్ కానుంది. అయితే బన్నీ ఒక హిందీ సినిమాలో గెస్ట్ రోల్ లో నటించనున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది.

అల వైకుంఠపురములో సినిమా బాలీవుడ్ లో కార్తీక్ ఆర్యన్, కృతిసనన్ హీరోహీరోయిన్లుగా రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. షెహ్ జాదా అనే టైటిల్ తో హిందీలో ఈ సినిమా తెరకెక్కుతుండగా అల్లు అర్జున్ ఈ సినిమాలో గెస్ట్ రోల్ లో నటిస్తున్నారని తెలుస్తోంది. బాలీవుడ్ ప్రేక్షకులకు నచ్చే విధంగా ఈ సినిమా కథలో కీలక మార్పులు చేశారని సమాచారం. ప్రముఖ దర్శకుడు రోహిత్ ధావన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండటం గమనార్హం.

అయితే అల్లు అర్జున్ గెస్ట్ రోల్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారో లేదో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే. షేహ్ జాదా మేకర్స్ వైరల్ అవుతున్న ఈ వార్త గురించి స్పందించి స్పష్టత ఇవ్వాల్సి ఉంది. మరోవైపు హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షాల వల్ల పుష్ప మూవీ షూటింగ్ ఆలస్యమవుతోందని తెలుస్తోంది. పుష్ప షూట్ లొకేషన్స్ వర్షాల వల్ల పాడయ్యాయని అందువల్ల పుష్ప షూటింగ్ కు బ్రేకులు పడ్డాయని వార్తలు వస్తుండటం గమనార్హం.

Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus