ప్రభాస్ తోపాటే వస్తానంటున్న కింగ్ నాగార్జున!

  • June 11, 2019 / 04:55 PM IST

ప్రస్తుతం టాలీవుడ్ నుంచి మాత్రమే కాదు యావత్ సౌత్ ఇండస్ట్రీ నుంచి వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రాల్లో “సాహో” ఒకటి. సాహో విడుదల తేదీ ప్రకటించేసరికి పెద్ద పెద్ద బాలీవుడ్ సినిమాలే తమ విడుదల తేదీలు మార్చుకొన్నాయి. కానీ.. మన టాలీవుడ్ కింగ్ నాగార్జున మాత్రం తన తాజా చిత్రం “మన్మధుడు 2″ని సాహోకి పోటీగా నిలిపేందుకు సన్నద్ధమవుతున్నాడు. అయితే.. ఈ పోటీ విడుదల తేదీల విషయంలో కాదు లెండి. జూన్ 13న “సాహో” టీజర్ విడుదలవుతున్న విషయం తెలిసిందే. నిన్న ఎనౌన్స్ మెంట్ వచ్చినప్పట్నుంచి ఆ విషయం ట్రెండ్ అవుతూనే ఉంది.

మరి ఈ బిగ్ డేను నాగార్జున కూడా క్యాష్ చేసుకోవాలనుకున్నాడో ఏమో కానీ.. “సాహో” టీజర్ తోపాటు “మన్మధుడు 2” టీజర్ కూడా రిలీజ్ చేయనున్నాడు. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో “చిలసౌ” అనంతరం తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రకుల్ కథానాయికగా నటిస్తుండగా.. కీర్తిసురేష్ ప్రత్యేక అతిధి పాత్ర పోషించింది. ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందనే విషయంలో ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు కానీ.. ప్రస్తుతానికైతే టీజర్ మాత్రం సాహోతో పోటీగా రిలీజ్ అవుతోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus