సాక్ష్యం మూడు రోజుల కలక్షన్స్

Advertisement

యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, పూజా హెగ్డే జంటగా శ్రీవాస్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం “సాక్ష్యం”. చిన్న హీరో అని చూడకుండా 40 కోట్లు ఖర్చు పెట్టి అభిషేక్‌ నామా గ్రాండ్ గా నిర్మించిన ఈ మూవీ గత శుక్రవారం రిలీజ్‌ అయి మంచి టాక్ అందుకుంది. సృష్టిలో జరిగే ప్రతి సంఘటనకు పంచభూతాలు సాక్ష్యాలే అనే కాన్సెప్ట్ తెరకెక్కిన ఈ చిత్రానికి మాస్ ప్రేక్షకులు జేజేలు పలుకుతున్నారు. మల్టీఫ్లెక్స్ లో ఈ మూవీకి కలక్షన్స్ తక్కువగా ఉన్నప్పటికీ బీ, సీ సెంటర్లలలో థియేటర్లు నిండిపోతున్నాయి. రోజురోజుకి కలక్షన్స్ పెంచుకుంటూ దూసుకుపోతోంది. తెలుగు రాష్ట్రాల్లో సాక్ష్యం ఫస్ట్ వీకెండ్ (మూడు రోజుల్లో) 7.06 కోట్ల షేర్ రాబట్టింది. ఏరియాల వారీగా కలక్షన్స్ వివరాలు…

ఏరియా : కలక్షన్స్
నైజాం : 2.25 కోట్లు
సీడెడ్ : 1.40 కోట్లు ఉత్తరాంధ్ర : 1.00 కోటి
గుంటూరు : 81 లక్షలు కృష్ణ : 50 లక్షలు
ఈస్ట్ గోదావరి : 49 లక్షలు
వెస్ట్ గోదావరి : 37 లక్షలు నెల్లూరు : 24 లక్షలు
తెలుగు రాష్ట్రాల్లో : 7.06 కోట్లు

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus