ప్రభాస్ సినిమా పై మరింత అంచనాలను పెంచేస్తున్న దిల్ రాజు?

  • June 8, 2019 / 03:51 PM IST

ప్రభాస్ అభిమానులంతా రెండేళ్ళు గా ఎదురుచూస్తున్న చిత్రం ‘సాహో’. ఇక మిగిలిన ప్రేక్షకులు కూడా ఈ చిత్రం కోసం ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ‘బాహుబలి’ వంటి ప్రతిష్టాత్మక చిత్రం కావడంతో ఈ చిత్రం పై క్రేజ్ పెరగడానికి కారణమయ్యింది. ఒక్క తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాదు బాలీవుడ్, కోలీవుడ్ ప్రేక్షకుల కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ చిత్రం ఆగష్టు 15 న విడుదల కాబోతుందని తెలిసిన వెంటనే అందరిలోనో మరింత ఆసక్తి మరింత పెరిగింది. ఇప్పుడు ఈ చిత్రం పై సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు మరింత అంచనాలు పెరిగేలా చేస్తున్నాడు.

విషయం ఏంటంటే.. ‘సాహో’ చిత్రం నైజాం, ఉత్తరాంధ్ర డిస్ట్రిబ్యూషన్ హక్కులకి గానూ 45 కోట్ల వరకూ ఆఫర్ చేసాడట. దిల్ రాజు ఇంత ఆఫర్ చేయడంతో ‘సాహో’ చిత్రం పై అంచనాలు మరింత బలపడుతున్నాయి. ‘ఈ చిత్రం పై దిల్ రాజు కి ఎంతో నమ్మకం ఉంటే గాని ఇంత పెద్ద మొత్తం ఆఫర్ చేయడనే’ కామెంట్స్ కూడా మొదలయ్యాయి. అయితే గతంలో ప్రభాస్ నటించిన చాలా సినిమాలను దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేసాడు. ఇక ప్రభాస్ తో కూడా దిల్ రాజుకి మంచి అనుబంధం ఉంది. గతంలో ప్రభాస్ తో ‘మున్నా’ ‘మిస్టర్ పర్ఫెక్ట్’ వంటి చిత్రాలని కూడా నిర్మించాడు దిల్ రాజు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus