అందరూ అలా అనుకుంటారు.. కానీ అది నిజం కాదు..!

  • April 18, 2019 / 05:09 PM IST

మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు సాయి తేజ్. మొదట ఈ హీరో దూకుడు చూస్తే.. ఆ ఫ్యామిలీలో టాప్ హీరోలుగా కొనసాగుతున్న చరణ్, బన్నీ లకు చెక్ పెట్టడం ఖాయమనుకున్నారు ప్రేక్షకులు. చూడటానికి అచ్చు గుద్దినట్టు చిరంజీవి లానే ఉండటం.. పవన్ కళ్యాణ్ మ్యానరిజమ్స్ కూడా అనుసరించడం తేజు కి ప్లస్ పాయింట్స్ అని అనుకున్నారు. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా కొట్టిన హిట్లకి… డబుల్ ఫ్లాపులు అందుకున్నాడు తేజు. మార్కెట్ చాలా వరకూ డౌన్ అయిపోయి రేసులో వెనుకపడ్డాడు. తాజాగా వచ్చిన ‘చిత్రలహరి’ చిత్రంతో కాస్త కోలుకున్నాడు. అసలు ఇలా ఎందుకు వెనుకపడిపోయాడనే ప్రశ్నని సాయి తేజ్ నే అడిగితే ఆసక్తి కరమైన సమాధానాలు చెప్పాడు.

ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సాయి తేజ్ మాట్లాడుతూ… ” సరైన కథలను ఎంచుకోకపోవడం మొదటి కారణంగా భావిస్తాను. ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుందనుకున్న కంటెంట్ ఒక్కోసారి వాళ్ళకి రీచ్ కాదు. ఫలితంగా సినిమా సరిగ్గా ఆడకపోవడం జరుగుతుంటుంది. ఇక సరైన సమయంలో విడుదల కాకపోయినా అదే ఫలితం ఉంటుంది. సినిమా పరాజయంపాలు కావడానికి ఇది రెండవ కారణమని నా అభిప్రాయం. ఇక నా చుట్టూవున్న కొంతమంది ఒత్తిడి చేయడం వలన, నేను కథలను సరిగ్గా పట్టించుకోకుండా ఒప్పేసుకుంటానని వార్తలు విన్నాను. అందులో ఎంతమాత్రం నిజం లేదు” అంటూ చెప్పుకొచ్చాడు తేజు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus