Sai Dharam Tej: తనను కాపాడిన వ్యక్తి రుణం సాయి ధరం తేజ్ అలా తీర్చుకున్నారా?

  • April 20, 2023 / 06:48 PM IST

మెగా హీరో సాయిధరమ్ తేజ్ తాజాగా విరూపాక్ష సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.ఈ సినిమా ఏప్రిల్ 21వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అయితే ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో తనని కాపాడిన వ్యక్తి గురించి పలు విషయాలను తెలియజేశారు. ఈయన రెండు సంవత్సరాల క్రితం సెప్టెంబర్ 10వ తేదీ ప్రమాదానికి గురైన విషయం మనకు తెలిసిందే.

ఇలా సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) ప్రమాదానికి గురైన వెంటనే అక్కడ ఉన్నటువంటి ఓ వ్యక్తి తనని చూసి వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్లే ఏర్పాటు చేయడంతో నేడు సాయిధరమ్ తేజ్ ప్రాణాలతో మన ముందు ఉన్నారని తెలుస్తోంది. అయితే తాజాగా సాయి ధరమ్ తేజ్ బైక్ ప్రమాదం జరిగిన సమయంలో తనను కాపాడిన సయ్యద్ అబ్దుల్ అనే వ్యక్తి గురించి కొన్ని విషయాలు తెలియజేశారు. ప్రమాదం నుంచి కోలుకున్న తర్వాత నేను ఆ వ్యక్తిని కలిశానని తెలిపారు.

ఆయనని కలిసి తనకు ఏ విధమైనటువంటి సహాయాన్ని అందించారనే విషయాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ.. డబ్బులు ఇచ్చి నా ప్రాణాలు నిలిపిన వ్యక్తికి థాంక్స్ చెప్పి తనని పంపించలేను.అందుకే నా నెంబర్ ఇచ్చి తనకు ఏ సమయంలో ఎప్పుడు ఎలాంటి సహాయం కావాలన్నా నాకు ఫోన్ చేయమని చెప్పానని తెలిపారు. నా కుటుంబ సభ్యులు అతనికి ఏదైనా డబ్బు సహాయం చేశారేమో నాకు తెలియదు కానీ నేను మాత్రం డబ్బులు ఇచ్చి ఆ డబ్బుతో తన మానవత్వాన్ని ముడి పెట్టలేను.

అతడికి సహాయం కావాలంటే ఎక్కడి వరకైనా తాను వెళ్తానని ఈ సందర్భంగా సాయిధరమ్ తేజ్ వెల్లడించారు. ఇదే సమయంలో తాను అసలు మద్యం సేవించనని క్లారిటీ ఇచ్చారు. ఇక ఆరోజు తాను ఇలాంటి బైక్ రైసింగ్ లో పాల్గొనలేదని డైరెక్టర్ దేవకట్టా ఇంటికి వెళ్తున్నట్టు ఈ సందర్భంగా సాయిధరమ్ తేజ్ తెలిపారు. ఇలా తన ప్రాణాలు కాపాడిన వ్యక్తి గురించి సాయి ధరమ్ తేజ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus