చరణ్, ఎన్టీఆర్ సినిమాపై సాయి ధరమ్ తేజ్ కామెంట్!

  • November 28, 2017 / 07:37 AM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినీ కెరీర్ లకు కిక్ ఇచ్చిన డైరెక్టర్ రాజమౌళి. చెర్రీ కి మగధీర వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన జక్కన్న… ఎన్టీఆర్ కి స్టూడెంట్ నంబర్ వన్, సింహాద్రి, యమదొంగ వంటి హిట్స్ ఇచ్చారు. సో వీరిద్దరిలో రాజమౌళి ఎవరితో సినిమా చేసినా ఆ ప్రాజక్ట్ పై అంచనాలు భారీగా ఉంటాయి. అటువంటిది.. ఇద్దరితో మల్టీ స్టారర్ మూవీ చేస్తే.. అందరి చూపు ఆ సినిమాపైనే ఉంటుంది. ఇప్పుడు అదే జరిగింది. రాజమౌళి రామ్ చరణ్, ఎన్టీఆర్ తో కలిసి ఉన్న ఓ ఫోటోని జక్కన్న పోస్ట్ చేసినప్పటి నుంచి ఈ చిత్రం గురించి తెలుసుకోవాలనే ఆలోచన అందరిలో పెరిగింది.

అందుకే మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తన సినిమా జవాన్ ప్రమోషన్లో మీడియా ముందుకు రావడంతో .. చరణ్, ఎన్టీఆర్ సినిమా గురించి అడిగారు. అందుకు సాయి స్పందిస్తూ.. “రాజమౌళి గారితో చరణ్, తారక్ ఫొటో దిగడం చూసి ఎదో క్యాజువల్ గా స్టిల్స్ ఇచ్చారేమో అనుకున్నా. ఆ తర్వాత నా ఫ్రెండ్ ఫోన్ చేసినపుడు ఫోటో చూశావా అని అడిగాడు. ఆ చూశాను ఏదో ఫంక్షన్‌ లో మీట్ అయినట్టున్నారు, అప్పుడు తీసుకున్నట్టున్నారు.. అన్నాను. వెంటనే వాడు ‘లేదురా అబ్బాయ్.. ప్రాజెక్ట్ అంట’ అనగానే షాక్ అయ్యాను. వెంటనే ఫోన్ చేసి అసలు విషయం తెలుసుకున్నా. అసలు అంత పెద్ద సినిమా రూపొందడం చాలా హ్యాపీగా ఉంది.

ఇద్దరు స్టార్ హీరోలు గ్రేట్ డైరెక్టర్ సినిమా చేస్తుండడం చాలా వండర్” అని సాయి ధరమ్ తేజ్ స్పష్టం చేశారు. మరి ఈ గ్రేట్ సినిమా తొందరగా మొదలవ్వాలి అని నందమూరి, మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus