Sai Dhraram Tej: పవన్ కళ్యాణ్ తో ఉన్న ఫోటోని షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేసిన సాయి ధరంతేజ్!

  • July 29, 2023 / 12:29 PM IST

మెగా హీరోలు సాయి ధరంతేజ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోలుగా నటించిన తాజా చిత్రం బ్రో. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి థియేటర్లలో ప్రేక్షకులను సందడి చేస్తుంది. ఈ సినిమా నేడు థియేటర్లలో విడుదల అయిన నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా నటుడు సాయి ధరమ్ తేజ్ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. సాయి ధరంతేజ్ పవన్ కళ్యాణ్ తో తన చిన్నప్పటి ఫోటోని షేర్ చేశారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ తో ఉన్నటువంటి ఈ ఫోటోని షేర్ చేస్తూ (Sai Dhraram Tej) సాయి ధరంతేజ్ అప్పటికి ఇప్పటికీ అంటూ క్యాప్షన్ పెట్టారు. అదేవిధంగా ఈ ఫోటోని ఉద్దేశిస్తూ ఈయన ఎమోషనల్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం నాలోని ప్రతి భావోద్వేగానికి అక్షర రూపం ఇవ్వాలనిపిస్తుంది. నా గురువు, మామయ్య నా స్ఫూర్తి. ఆయనతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకొని అవకాశం నాకు లభించింది. ఇప్పటికీ నేను ఆయన వేలు పట్టుకొని నడిచే ఒక చిన్న పిల్లాడినే.

నాపై నమ్మకం ఉంచి ఇంత గొప్ప పెద్ద సినిమాకు నన్ను ఎంపిక చేసినందుకు త్రివిక్రమ్ శ్రీనివాస్ కు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే సముద్రకనితో పాటు ఇతర చిత్ర బృందానికి కూడా ఈయన పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు. అదేవిధంగా తన ముగ్గురు మామయ్యలు అలాగే వారి అభిమానులు ప్రేక్షకులకు కూడా ఈ సందర్భంగా సాయిధరమ్ తేజ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ విధంగా సాయిధరమ్ తేజ్ ఎమోషనల్ ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

రోడ్డు ప్రమాదం తర్వాత కొంతకాలం పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ అందుకుంది ఈ సినిమా తర్వాత బ్రో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ప్రస్తుతం సాయి తేజ్ ఎలాంటి సినిమాలకు కమిట్ అవ్వలేదు. అయితే ఈయన ఒక ఆరు నెలల పాటు ఇండస్ట్రీకి విరామం ప్రకటించాలని భావించారు.

ఆ హీరోల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్
తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus