పవన్ సినిమా అయినా నో కాంప్రమైజ్!

  • December 25, 2020 / 04:11 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో బిజీగా గడుపుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ‘వకీల్ సాబ్’ సినిమాలో నటిస్తోన్న పవన్ కొన్ని రోజుల్లో మలయాళం సినిమా ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ రీమేక్ షూటింగ్ లో పాల్గొనున్నాడు. సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో రానా దగ్గుబాటి సెకండ్ హీరోగా కనిపించనున్నాడు. కథ ప్రకారం పవన్ పోలీస్ ఆఫీసర్ రోల్ లో కనిపించనుండగా.. రానా ఎక్స్ మిలిటరీ ఆఫీసర్ గా కనిపించనున్నారు. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకుంది.

ఈ సినిమాలో రానా సరసన ఐశ్వర్య రాజేష్ ని హీరోయిన్ గా తీసుకున్నట్లు సమాచారం. ఆమె రోల్ చిన్నదే అయినా క్రేజీ ప్రాజెక్ట్ కావడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక పవన్ సరసన హీరోయిన్ గా సాయి పల్లవిని తీసుకోవాలనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. రీసెంట్ గా దర్శకనిర్మాతలు ఆమెని సంప్రదించగా.. రెమ్యునరేషన్ రూ.2కోట్లు డిమాండ్ చేసిందట ఈ బ్యూటీ.

మహా అయితే సినిమా మొత్తం నాలుగైదు సీన్లలో మాత్రమే కనిపిస్తుంది ఈ పాత్ర. అయినప్పటికీ ఆ సన్నివేశాలు హైలైట్ గా ఉంటాయి. అందుకే సాయి పల్లవిని తీసుకోవాలనుకున్నారు. కానీ అమ్మడు డిమాండ్ చేసిన మొత్తం విని నిర్మాతలు షాక్ తిన్నారు. మరి ఆమె అడిగినంత ఇచ్చి హీరోయిన్ గా ఫైనల్ చేసుకుంటారో లేక మరో ఆప్షన్ చూసుకుంటారేమో చూడాలి!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus