విద్యాబాలన్ స్నేహితురాలిగా సాయి పల్లవి..!

  • December 24, 2018 / 01:33 PM IST

ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్ లో బయోపిక్ ల హవా ఎక్కువయిందనే చెప్పాలి. ప్రస్తుతం బాలకృష్ణ – క్రిష్ కలిసి తెరకెక్కించిన ‘ఎన్టీఆర్’ బయోపిక్ విడుదలకు రెడీ అవుతుంది. ఇది ‘ఎన్టీఆర్’ జీవితంలో సినీ, మరియు రాజకీయ ఎదుగుదల ఎలా సాగింది అనే అంశం పై తెరకెక్కిస్తుండగా… మరో పక్క రాంగోపాల్ వర్మ ఎన్టీఆర్ ను వెన్ను పోటు పొడిచారంటూ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ పేరుతో మరో బయోపిక్ ను తెరకెక్కిస్తున్నాడు.

ఇప్పుడు ఇదే రీతిగా కోలీవుడ్ లో జారుతుండడం గమనార్హం. తమిళంలో మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత సినీ, రాజకీయ జీవిత ఆధారంగా ఓ బయోపిక్ ను తీస్తున్నారు. ‘ది ఐరన్ లేడీ’ పేరుతో ఈ బయోపిక్ తెరకెక్కుతుంది. ఇందులో నిత్యా మీనన్ జయలలితగా నటిస్తుండడం విశేషం. ఇదిలా ఉంటే జయలలిత ఎదుర్కొన్న సమస్యలు, తనని ఇబ్బంది పెట్టిన సంగతులను జ్ఞాపకం చేస్తూ మరో బయోపిక్ ను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో జయలలిత పాత్రలో బాలీవుడ్ భామ విద్యాబాలన్ నటిస్తుండగా దర్శకుడు ఏ.ఎల్. విజయ్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఇక ఈ చిత్రంలో జయలలిత స్నేహితురాలు శశికళ పాత్ర కూడా ప్రాధాన్యం ఉందట. తాజా సమాచారం ప్రకారం ఈ పాత్రకు సాయిపల్లవిని ఎంచుకున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా, మిగిలిన నటీనటుల వివరాలు త్వరలో ప్రకటించబోతున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus