చిరంజీవి కోసం సాయి పల్లవి కెరీర్ డామేజ్ చేసుకుంటుందా?

  • September 11, 2020 / 03:27 PM IST

మెగాస్టార్ చిరంజీవి ఓ క్రేజీ రీమేక్ కి సిద్ధం అవుతున్నారు. 2015లో అజిత్ హీరోగా దర్శకుడు శివ తెరకెక్కించిన వేదాళం మూవీ రీమేక్ లో ఆయన నటించనున్నారు. దీనిపై అధికారిక ప్రకటన లేకున్నప్పటికీ దాదాపు ఖాయమే అనేది టాలీవుడ్ టాక్. పవన్ కళ్యాణ్ కూడా దర్శకుడు మెహర్ రమేష్ తో చిరంజీవి మూవీ ఉందని సోషల్ మీడియా ద్వారా స్పష్టం చేశారు. కాబట్టి మెహర్ రమేష్ చిరంజీవితో చేయనున్న మూవీ వేదాళం తెలుగు రిమేక్ అనేది గట్టి వాదన.

ఇక ఈ చిత్రంలో హీరో చెల్లెలి పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ పాత్ర విషయమై ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతుంది. వేదాళం తెలుగు రీమేక్ లో చిరంజీవి చెల్లి పాత్ర కోసం సాయి పల్లవిని అనుకుంటున్నారట. చిరంజీవి చెల్లిగా సాయి పల్లవి అయితే బాగుంటుందని దర్శక నిర్మాతల ఆలోచనగా తెలుస్తుంది. ఆమె కనుక ఒప్పుకుంటే ఈ పాత్ర చేయించాలని అనుకుంటున్నారట.

స్టార్ హీరోయిన్ హోదా లేకున్నా సాయి పల్లవికి తెలుగు మరియు తమిళ పరిశ్రమలలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మరి ఇంత డిమాండ్ ఉన్న హీరోయిన్ చెల్లెలు పాత్ర చేస్తుందా అంటే డౌటే. ఒకసారి చెల్లి పాత్ర చేస్తే హీరోయిన్ కి కెరీర్ ఉండదు, ప్రేక్షకులు ఆమెను హీరోయిన్ గా భావించరు. చిరంజీవి కోసం సాయి పల్లవి ఈ రిస్క్ చేస్తుందో లేదో చూడాలి.

Most Recommended Video

బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
బిగ్‌బాస్‌ 4 హైలెట్స్: బిగ్‌బాస్‌ ఇలా రోజూ అయితే కష్టమే!
బిగ్‌బాస్‌ 4: ఇంట్లో వాళ్లు ఒకరు… బయటి నుంచి ముగ్గురట!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus