ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసుకున్న శైలజా రెడ్డి అల్లుడు

  • July 21, 2018 / 11:07 AM IST

చందు మొండేటి దర్శకత్వంలో యువ సామ్రాట్ నాగ చైతన్య సవ్యసాచి మూవీని కంప్లీట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ మూవీ టీజర్ కూడా రిలీజ్ కాకముందే మారుతీ దర్శకత్వంలో శైలజా రెడ్డి అల్లుడు సినిమాని కంప్లీట్ చేసారు. ఈ మూవీ ఫస్ట్ లుక్ రీసెంట్ గా రిలీజ్ అయి మంచి స్పందన అందుకుంది. అను ఇమ్యానుయేల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ అయినట్లు చిత్ర బృందం స్పష్టం చేసింది. త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభించి ఆగస్ట్ 31న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

మలయాళ సంగీత దర్శకుడు గోపిసుందర్ అందించిన ఆడియోను త్వరలోనే విడుదల చేయనున్నారు. ఈ సినిమా జోరు చూస్తుంటే సవ్యసాచి కంటే ఈ మూవీ ముందు రిలీజ్ అయ్యేలా ఉంది. రెండు సినిమాలను కంప్లీట్ చేసినప్పటికీ చైతూ రెస్ట్ తీసుకోవడం లేదు. కె.ఎస్‌. రవీంద్ర (బాబి) దర్శకత్వంలో నటించడానికి సిద్ధంగా ఉన్నారు. వెంకీమామ అనే టైటిల్ పరిశీలిస్తున్న ఈ చిత్రంలో వెంకటేష్ తో కలిసి నాగచైతన్య స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. మల్టీ స్టారర్ సినిమాల జోరు కొనసాగుతున్న ఈ సమయంలో మామఅల్లుళ్ళు కలిసి చేస్తున్న ఈ మల్టీస్టారర్ మూవీపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus