సమంత కూడా పాన్ ఇండియా అంటోంది

  • February 8, 2021 / 08:11 PM IST

అక్కినేని వారి కొడలు సమంత పెళ్లి తరువాత కూడా బిజీగా మారుతోంది. హోస్ట్ గా కూడా గత ఏడాది సరికొత్తగా దర్శనమిచ్చిన సమంత ఈ ఎడాది మరింత కొత్తగా ఆడియేన్స్ ను ఎంటర్టైన్ చేయనుంది. ముఖ్యంగా పాన్ ఇండియా రేంజ్ లో సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది. సమంత ఎలాంటి సినిమా చేసినా కూడా ఈ మధ్య కాలంలో బాక్సాఫీస్ వద్ద మినిమమ్ వసూళ్లను అందుకుంటున్నాయి. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలను పక్కన పెట్టినట్లు అర్ధమవుతోంది.

ఇక గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం అనే సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమాను పాన్ ఇండియా ఫిల్మ్ గా తెరకెక్కించాలని దర్శకుడు గుణశేఖర్ ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం. ఎందుకంటే సనంత నెక్స్ట్ ది ఫ్యామిలీ మ్యాన్ సెకండ్ సీజన్ తో హిందీ ఆడియేన్స్ ను సరికొత్తగా ఆకట్టుకోవడానికి సిద్ధమైంది. ఆ వెబ్ కంటెంట్ తప్పకుండా క్లిక్కవుతుందని ట్రైలర్ కు వచ్చిన రెస్పాన్స్ తో అర్ధమవుతోంది.

ఇక ఎలాగూ సౌత్ లో అన్ని భాషల్లో సమంతకు క్రేజ్ ఉంది కాబట్టి శాకుంతలం సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో నిర్మించాలని దర్శకుడు ప్లాన్ చేసుకుంటున్నాడు. మరి ఆ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.

Most Recommended Video

జాంబీ రెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా
శృతీ ఈ సినిమాలను రిజెక్ట్ చేసి మంచి పనే చేసిందా..?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus