అక్కడ రికార్డు కల్లెక్షన్లని రాబడుతోన్న మహేష్ సినిమా..!

  • January 11, 2020 / 06:04 PM IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఈరోజు విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే యూ.ఎస్ లో అనేక చోట్ల ప్రీమియర్ షోలు ప్రదర్శింపబడి హిట్ టాక్ ను సంపాదించుకుంది. ఇక మహేష్ బాబుకి ఓవర్సీస్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. యూఎస్ ప్రీమియర్స్ లో కూడా ‘సరిలేరు నీకెవ్వరు’ దుమ్మురేపుతోందనే చెప్పాలి. ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రీమియర్స్ ద్వారా $ 759,000 లక్షల డాలర్లను వసూలు చేసినట్టు తెలుస్తుంది.

ఈ వసూళ్లు ఇంకా పెరిగే అవకాశం కూడా ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. మొత్తానికి ప్రీమియర్ షోస్ ద్వారానే ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం 1 మిలియన్ కు చేరువయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ‘అల వైకుంఠపురములో’ చిత్రం లేకపోతే.. మరింత భారీ వసూళ్ళు వచ్చేవి అనడంలో సందేహం లేదు. ఎందుకంటే అక్కడ దర్శకుడు త్రివిక్రమ్ సినిమాలకు అసాధారణమైన ఓపెనింగ్స్ వస్తాయి కాబట్టి.. భారీ పోటీ ఏర్పడింది. లేకపోతే ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం 1.5 మిలియన్ వరకూ ప్రీమియర్స్ వసూళ్ళు వచ్చేవేమో. ఏదైనా ‘సరిలేరు నీకెవ్వరు’ బుకింగ్స్ ఇప్పటికీ జరుగుతూనే ఉండడం విశేషం.

సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
దర్బార్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus