మహేష్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్!

  • January 29, 2021 / 03:28 PM IST

గతేడాది మొత్తం లాక్ డౌన్ కారణంగా వాయిదా పడ్డ సినిమాలన్నీ ఒక్కొక్కటిగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఇక రెండు రోజుల నుండి దర్శకనిర్మాతలు సెట్స్ పై ఉన్న తమ సినిమాల రిలీజ్ డేట్లను ప్రకటిస్తూ లాక్ చేస్తున్నారు. ‘పుష్ప’, ‘గని’, ‘విరాటపర్వం’ ఇలా పేరున్న సినిమాల విడుదల తేదీలను అనౌన్స్ చేశారు. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు వంతు వచ్చింది. ఆయన నటిస్తోన్న ‘సర్కారు వారి పాట’ రిలీజ్ డేట్ ని నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అధికారికంగా వెల్లడించింది.

వచ్చే ఏడాది 2022 సంక్రాంతికి ఈ క్రేజీ ప్రాజెక్ట్ ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనికి సంబంధించి టైటిల్ పోస్టర్ ని విడుదల చేశారు. పోస్టర్ కూడా ఎంతో ఇంటెన్స్ గా డిజైన్ చేశారు. మహేష్ బాబుకి సంక్రాంతి సీజన్ బాగా కలిసొస్తుంది. గతేడాది సంక్రాంతికి విడుదల చేసిన ‘సరిలేరు నీకేవ్వరు’ సినిమా రికార్డులు సృష్టించింది. ఇప్పుడు మరోసారి అదే డేట్ ను నమ్ముకున్నారు. ‘గీత గోవిందం’ ఫేమ్ పరశురామ్ రూపొందిస్తోన్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దుబాయిలో జరుపుకుంటుంది.

బ్యాంకిగ్ రంగంలో జరిగే ఆర్థిక నేరాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు టాలీవుడ్ టాక్. కీర్తి సురేశ్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

Most Recommended Video

ఈ 10 మంది సినీ సెలబ్రిటీలకు తల్లులు వేరైనా తండ్రులు ఒకరే..!
సౌత్ లో సక్సెస్ అయిన టాక్ షోలు.. ఏ తారలు హోస్ట్ చేసినవంటే..!
వరల్డ్ రికార్డ్ కొట్టి.. టాలీవుడ్ స్థాయిని పెంచిన సెలబ్రిటీల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus