షూటింగ్లో రకుల్ అండ్ టీం పై దాడి.. గాయపడ్డ సిబ్బంది..!

  • February 23, 2021 / 05:05 PM IST

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్.. షూటింగ్లో పాల్గొంటుండగా కొందరు రాళ్ళతో దాడి చెయ్యడం సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే.. ఇప్పుడు వరుసగా బాలీవుడ్లో కూడా ఆఫర్లు అందుకుంతుంది రకుల. అక్కడ అజయ్ దేవగన్ సినిమాతో పాటు జాన్ అబ్రహం సినిమాలో కూడా నటిస్తూ బిజీగా గడుపుతుంది. ఈ నేపథ్యంలో.. జాన్ అబ్రహంతో రకుల్ చేస్తున్న సినిమా ‘ఎటాక్’ పేరుతో తెరకెక్కుతోంది. లక్ష్యరాజ్ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని ఇదే ఏడాది ఆగస్టు 13న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ ఉత్తర్ ప్రదేశ్ లోని ధనిపూర్లో జరుగుతుంది. ఈ నేపథ్యంలో షూటింగ్ చూడడానికి స్థానికులు ఎగబడి వచ్చారు. అసలే అది మాస్ ఏరియా కావడంతో వారిని కంట్రోల్ చెయ్యడం సిబ్బందికి కూడా కష్టమైపోయింది. ఈ క్రమంలో స్థానికులను కంట్రోల్ చెయ్యడానికి సెక్యూరిటీ సిబ్బంది కాస్త కఠినంగా వ్యవహరించి ఒకరిద్దరి పై చెయ్యి చేసుకున్నారు. అంతే స్థానికులు వాగ్వివాదానికి దిగడంతో పాటు రాళ్ళతో కూడా చిత్ర యూనిట్ సభ్యుల పై దాడి చెయ్యడం మొదలుపెట్టారు.

దాంతో చిత్ర యూనిట్ సభ్యుల పోలీసులను ఆశ్రయించగా.. వారు ఎంట్రీ ఇవ్వగానే స్థానికులు చెదిరిపోయినట్టు తెలుస్తుంది. అటు తరువాత షూటింగ్ పూర్తయ్యేవరకూ కూడా పోలీసుల అక్కడే ఉన్నారట. ఈ దాడిలో సెక్యూరిటీ సిబ్బంది గాయపడ్డారట. అయితే హీరో జాన్ అబ్రహం అలాగే హీరోయిన్ రకుల్ కు ఎటువంటి గాయాలు కాలేదని సమాచారం.

Most Recommended Video

పిట్ట కథలు సిరీస్ రివ్యూ & రేటింగ్!
నాంది సినిమా రివ్యూ & రేటింగ్!
పొగరు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus