Chiranjeevi: ఆ ప్రాజెక్ట్ ల విషయంలో మెగాస్టార్ సైలెన్స్ కు కారణమిదా?

  • April 6, 2023 / 12:33 PM IST

మెగాస్టార్ చిరంజీవి వరుస విజయాలతో జోరుమీదుండగా భోళా శంకర్ సినిమాతో చిరంజీవి ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ గ్యారంటీగా చేరుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో చిరంజీవి వయస్సుకు తగిన పాత్రలను ఎంచుకుంటూ కెరీర్ విషయంలో విజయవంతంగా అడుగులు వేస్తున్నారు. మెహర్ రమేశ్ డైరెక్షన్ లో భోళా శంకర్ తెరకెక్కుతుండగా ఈ సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. తమన్నా, కీర్తి సురేష్ హీరోయిన్లుగా నటిస్తుండటం ఈ సినిమాకు ఒక విధంగా ప్లస్ అయింది.

చిరంజీవి పారితోషికం 100 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని వార్తలు వినిపిస్తుండగా ఆ వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది. అయితే చిరంజీవి కొత్త ప్రాజెక్ట్ లను త్వరలో ప్రకటిస్తారని ఫ్యాన్స్ భావించగా అందుకు భిన్నంగా జరుగుతోంది. వరుసగా కథలు వింటున్న చిరంజీవి ఏ ప్రాజెక్ట్ లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారో తెలియాల్సి ఉంది. చిరంజీవి భోళా శంకర్ విడుదలైన తర్వాతే కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటిస్తారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తన పుట్టినరోజు తర్వాత కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించే అవకాశం అయితే ఉందని తెలుస్తోంది. చిరంజీవి మాస్ మసాలా సినిమాలకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని భావిస్తున్నారని తెలుస్తోంది. మెగాస్టార్ మనస్సులో ఏముందో తెలియాలంటే మరికొన్ని వారాలు ఆగాల్సిందే. చిరంజీవి కొత్త తరహా కథాంశాలతో ప్రయోగాలు చేయడం కంటే మాస్ మసాలా సినిమాలపై దృష్టి పెడితే బెటర్ గా ఉంటుంది.

చిరంజీవి కొడుకు రామ్ చరణ్ వరుస విజయాలతో కెరీర్ పరంగా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. చిరంజీవి చరణ్ రాబోయే రోజుల్లో మరిన్ని సినిమాలలో కలిసి నటించడంతో పాటు మరిన్ని సక్సెస్ లను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మెగా హీరోలు వరుస విజయాలను సొంతం చేసుకుని ప్రేక్షకులను ఆకట్టుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus