Radhe Shyam: రాధేశ్యామ్ కు అసలు సమస్య ఇదే?

బాహుబలి, బాహుబలి2 సినిమాలు రిలీజై సక్సెస్ సాధించిన తర్వాత టాలీవుడ్ దర్శకనిర్మాతలు విజువల్ ఎఫెక్ట్స్ కు ప్రాధాన్యతనిస్తున్నారు. ప్రభాస్ హీరోగా నటిస్తూ అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న రాధేశ్యామ్ మూవీలో కూడా విజువల్ ఎఫెక్ట్స్ కు ప్రాధాన్యత ఉంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు కేవలం 50 శాతం విఎఫ్ఎక్స్ వర్క్ పూర్తైందని మిగిలిన 50 శాతం విఎఫ్ఎక్స్ వర్క్ బ్యాలెన్స్ ఉందని సమాచారం. మరోవైపు ప్రభాస్ నటించాల్సిన సన్నివేశాల షూటింగ్ బ్యాలెన్స్ ఉండగా ప్రభాస్ ఈ సినిమాకు ఎప్పుడు డేట్స్ కేటాయిస్తారో తెలియాల్సి ఉంది.

మేకర్స్ ఈ సినిమాకు సంబంధించి అప్ డేట్స్ ఇవ్వకపోవడంతో ప్రభాస్ ఫ్యాన్స్ కు ఈ సినిమా ఎప్పుడు రిలీజవుతుందో అర్థం కావడం లేదు. మరోవైపు బాలీవుడ్ లో రాధేశ్యామ్ సినిమాకు రిలీజ్ డేట్ దొరకడం కూడా అంత తేలిక కాదు. ప్రభాస్ కు జోడీగా ఈ మూవీలో పూజా హెగ్డే నటిస్తున్నారు. ఈ ఏడాదే రాధేశ్యామ్ రిలీజవుతుందా..? అనే ప్రశ్నలు సైతం ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం. రాధేశ్యామ్ షూటింగ్ పూర్తైనా విఎఫ్ఎక్స్ వర్క్ పూర్తైతే మాత్రమే రిలీజ్ డేట్ కు సంబంధించి క్లారిటీ అయితే వచ్చే అవకాశాలు ఉంటాయి.

ఈ సినిమాలో షాకింగ్ ట్విస్ట్ లు ఉంటాయని పునర్జన్మ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. భాగ్యశ్రీ, కృష్ణంరాజు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus